మంచు మోహన్ బాబూ కూతురు మంచు లక్ష్మీ కి మంచి పేరు ఉందన్న సంగతి తెలిసిందే. తండ్రి ద్వారా సినిమాల లోకి వచ్చిన ఈ అమ్మడు తన నటన తో వరుస సినిమాల లొ నటించె అవకాశాన్ని అందుకున్నది.. అదే జోష్ లో సినిమాలను చేసింది. కొన్ని భారీ షాక్ ఇచ్చాయి. మరికొన్ని సినిమాలు బాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి అందరికి తెలిసిందే.. అయితే ఈ అమ్మడు కు సోషల్ మీడియాలో మంచి ఫాలొయింగ్ ఉందన్న సంగతి అందరికి తెలుసు. ఎప్పటికప్పుడు తన తాజా ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కామెంట్లు అందుకుంది.
ఇటీవల ఈ అమ్మాయికి ఓ అభిమాని కొన్ని వింత ప్రశ్నలు అడిగి కోపం తెప్పించిన సంగతి తెలిసిందే..ఇది ఇలా ఉండగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతుంది. వరుసగా తారలు అందరూ కూడా కరొనా తో పోరాడి అలిసిపోయి చనిపొథున్నారు.కొద్ది రోజుల క్రితం మంచు మనోజ్ కుమార్ ఈ మహమ్మారి బాధితుల జాబితాలో చేరగా.. తాజాగా అతని సోదరి మంచు లక్ష్మి కరోనాకు గురైంది. ఆమే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. 'రెండేళ్ల నుంచి బూచోడు లాంటి కరోనా వైరస్ నుంచి తప్పించుకుని తిరుగుతున్నాను. కానీ చివరికి దాని చేతిక చిక్కక తప్పలేదు. దానితో పోరాడేందుకు ఎంతో ప్రయత్నించాను.
కానీ దానికి వేరే ప్రణాళికలు ఉన్నాయనుకుంటాను. అందుకే నన్ను విడిచిపెట్టలేదు. కరోనాకు చికిత్స తీసుకుంటున్నాను.. నాకు వున్న స్కిల్స్ తో నేను దానిని ధైర్యంగా తరిమి కొడతాను అని చెప్పుకొచ్చింది..కరోనా రక్షణకు సంబంధించి తన అభిమానులకు కొన్ని జాగ్రత్తలు సూచించిందీ మల్టీ ట్యాలెంటెడ్ నటి. 'అందరూ ఇంట్లో సురక్షితంగా ఉండండి. మాస్కులు తప్పనిసరిగా ధరించండి. వ్యాక్సిన్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ఇప్పటికే రెండు డోసుల టీకా తీసుకొనిఉంటే.. బూస్టర్ కూడా తీసుకునేందుకు ప్రయత్నించండి... నాకు బోర్ కొడుతుంది.. ఏదైనా మంచి సలహాలు ఇవ్వండి అంటూ పోస్ట్ చేసింది..