పాన్ ఇండియా మూవీ ‘యశోద’.. మరో అడుగు..!

N.ANJI

విడాకుల అనంతరం సమంత తన ఊపును పెంచింది. ఇప్పటికే పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. ఇటీవల విడుదలైన పుష్పా సినిమాలో ఐటెం సాంగ్‌లో నటించి కుర్ర కారును ఊర్రూతలూగించారు. ‘ఊ అంటావా మామ.. ఉహు అంటావా మామ’ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది. దీంతో తన క్రేజ్ మొదటి కంటే భారీగానే పెరిగింది. దీంతో సమంత తన కెరియర్‌ను స్పీడప్ చేసింది. బాలీవుడ్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తోంది.


ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్‌గా కొనసాగిన నాగ చైతన్య, సమంత అర్ధాంతరంగా విడిపోయారు. వాస్తవానికి వాళ్లు ఏ రీజన్‌తో విడిపోయారనే విషయంపై స్పష్టత లేదు. విడిపోయాక ఎవరి దారి వాళ్లు చూసుకున్నా.. సమంత మాత్రం ఏదో ఒక సందర్భంలో అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూనే ఉంది. విడాకులతో తన కెరియర్‌ను స్పీడప్ చేసిన సమంత.. ఇప్పటికే పలు సినిమాల్లో నటించేందుకు అవకాశాలు దక్కించుకుంది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘యశోద’. ఈ సినిమాను హరి, హరీష్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.


యశోద సినిమాకు శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఉన్ని ముకుందన్‌, రావు రమేష్‌, మురళీ శర్మ వంటి నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే యశోద సినిమా తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. కాగా, గురువారం నాడు రెండవ షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. యశోద సినిమా రెండవ షెడ్యూల్‌ను ప్రారంభించామన్నారు. ఈ నెల 12వ తేదీ వరకు పలు కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. రెండవ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సంక్రాంతికి మూడవ షెడ్యూల్‌ ప్రారంభిస్తామన్నారు. మార్చి నెలాఖరులో సినిమా షూటింగ్ పూర్తవుతుందని, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పూర్తి చేసుకున్న తర్వాత.. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తామన్నారు. కాగా, ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలు అందిచగా.. ఎం.సుకుమార్ ఛాయా గ్రాహకుడిగా వ్యవహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: