బాలీవుడ్ ఆఫర్లపై స్పందించిన దేవి, థమన్..

Purushottham Vinay
దాదాపు 10 సంవత్సరాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో పోటాపోటీగా సంగీతమందిస్తున్నారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ఎస్ ఎస్ తమన్. వీరు ఎప్పుడు పోటీ పడుతూ మిగతా వారితో పోల్చుకుంటే తెలుగులో టాప్ ప్లేస్ లో ఉన్నారు అని చెప్పాలి.ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ లు కూడా స్టార్ హీరోలకు తగ్గట్టుగా సినిమాలకు సరిపోయే విధంగా మంచి మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా విజయంలో పాటలు ఎంత ముఖ్యమో వీరు గుర్తు చేస్తున్నారు. అయితే వీరి ఇద్దరికీ బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా గతంలో చాలానే ఆఫర్స్ వచ్చాయి. కానీ అటు వైపు వెళ్ళడానికి ఎందుకో ఇష్టపడడం లేదు.గతంలో దేవి శ్రీ ప్రసాద్ కూడా సల్మాన్ ఖాన్ రెడీ సినిమాలో ఒక పాటకు ట్యూన్ కూడా కట్టాడు. ఇక ఆ తర్వాత మళ్లీ అవకాశాలు వచ్చినా కాని ఎందుకో చేయలేదు. ఇక యస్ యస్ థమన్ కూడా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఆఫర్స్ పై చాలా క్లారిటీ గా వివరణ ఇచ్చాడు.

థమన్ కూడా బాలీవుడ్ లో ఎంతో ఇష్టంగా రెండు మూడు సినిమాలకు మ్యూజిక్ అందించాడు. కానీ అతను సోలోగా మ్యూజిక్ ఇవ్వలేదు కేవలం రెండు మూడు పాటలు మాత్రమే కంపోజ్ చేశాడు.ఇక అంతేకాకుండా ఒక సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా థమన్ ఇచ్చాడు. అయితే ఈ విషయంలో మాత్రం థమన్ తో పాటు దేవిశ్రీప్రసాద్ కూడా ఒకే తరహాలో ఆలోచిస్తున్నాడట. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఒక సినిమా నుంచి కనుక ఒక పాట వస్తే మంచి విజయాన్ని అందుకుంటాయి. అయితే ఆ పాటకు ఎవరు మ్యూజిక్ కంపోజ్ చేశారు అనే విషయంలో చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది అని ఒకే సినిమాకు నలుగురు లేదా ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండడం ఏమిటని ఇటీవల దేవిశ్రీప్రసాద్ వివరణ కూడా ఇచ్చాడు.అయితే గతంలోనే థమన్ కూడా ఈ విషయంలో అదే తరహాలో వివరణ ఇచ్చాడు.

పెళ్లి ఒకడు చేసుకుంటే శోభనం మరొకడితో అన్నట్లుగా ఒకరు పాటలు అందిస్తే మరొకరు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడం ఏమిటో అర్థం కావడం లేదని అందుకే బాలీవుడ్ సినిమాలు చేయడం లేదు అని థమన్ తెలియజేశాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ కూడా దాదాపు అదే విధంగా బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి అదే కారణమని ఒక సినిమా పూర్తిగా సంగీతం అందించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని దేవి తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: