అమ్మ బాబోయ్: ప్రభాస్ ‘ఆదిపురుష్’ బడ్జెట్ ఎంతో తెలుసా..?

N.ANJI
పాన్ ఇండియన్ స్టార్ రేంజ్ క్రియేట్ చేసుకున్నారు ప్రభాస్. బహుబలితో తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతీని ప్రపంచానికి తెలియజేసిన ఘనత దర్శకుడు రాజమౌలి, ప్రభాస్‌దే. కాగా, ప్రస్తుతం రాధేశ్యామ్‌లో నటించారు. నటిగా పూజా హెగ్డే నటించిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి. కానీ, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చాలా వరకు సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో నటించనున్నారు. అయితే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. సినిమా కోసం ఎంత బడ్జెట్ కేటాయిస్తారో తెలిస్తే బాలీవుడ్ హీరోలకు నిద్ర పట్టదని ప్రభాస్ అభిమానులు చెబుతున్నారు.
ప్రభాస్‌తో సినిమా తీయాలంటే.. కనీసం రూ.300 కోట్ల బడ్జెట్ ఉండాలని, యూనివర్సల్‌ కథ ఉండాలని చెబుతున్నారు. ఈ సినిమా అన్నీ భాషల్లో రిలీజ్ అవుతుందని, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే కథ ఉండాలి. హై టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మాత ఏ మాత్రం తగ్గకుండా.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా.. బడ్జెట్ కేటాయించే నిర్మాత దొరకాలన్నారు. అలాంటి ప్రాజెక్ట్ కొనసాగించాలంటే అందరి వల్ల జరగదన్నారు. అన్నీ అనుకున్నట్టుగా కుదరదన్నారు. అందుకే ప్రభాస్ ఆ రేంజ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలో ‘ఆదిపురుష్’ ఒకటి. ప్రభాస్ తన కెరియర్‌లోనే మొట్ట మొదటిసారిగా పౌరాణిక కథలో నటించనున్నారు. ఈ సినిమా ప్రభాస్ రాముడిగా నటించనున్నారు. అంతేకాదు ప్రభాస్ బాలీవుడ్‌లో ఫస్ట్ స్ట్రైట్ మూవీ అని అన్నారు. అందుకే ఈ సినిమాను బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించనున్నారు.
ఈ సినిమాలో స్టార్ హీరో హీరోయిన్‌లు సైఫ్ అలీఖాన్, కృతీ సనన్ నటించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సన్సెషనల్‌గా మారింది. ఆదిపురుష్ సినిమా బడ్జెట్ దాదాపు రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం. ఇంత భారీ బడ్జెట్‌తో ఒక టాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి సినిమా తీస్తుండటంతో బాలీవుడ్ స్టార్ హీరోలకు నిద్ర పట్టడం లేదని అభిమానులు కాలర్ ఎగురవేస్తున్నారు. ఈ సినిమా 10 భాషల్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: