టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నితిన్ అంటే తెలియని వారు ఉండరు. మూవీ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి తనయుడైన నితిన్.. తేజ దర్శకత్వం వహించిన `జయం` సినిమాతో హీరోగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఈయన.. తనదైన టాలెంట్తో ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు.
వి. వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన `దిల్`, ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన `సై` చిత్రాలు నితిన్ కెరీర్ను టాప్ ప్లేస్కి తీసుకెళ్లడానికి ఎంతో ప్లస్ అయ్యాయి. ఇక పోతే గత కొన్నేళ్ల నుంచి ఈయన హీరోగా ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు సొంతంగా శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ను స్థాపించి నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు.
అయితే ఈ క్రమంలోనే ఓసారి అక్కినేని హీరో దెబ్బకు నితిన్ నిండా మునిగిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నితిన్ ఇప్పటివరకు నిర్మించిన చిత్రాల్లో `అఖిల్` ఒకటి. కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని డబ్యూ మూవీ ఇది. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయేషా సైగల్ హీరోయిన్గా నటించింది. వెలిగొండ శ్రీనివాస్ కథ అందించిన ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్పై నితిన్ భారీ బడ్జెట్తో నిర్మించారు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషించారు.
ఇక భారీ అంచనాల నడుమ 11, నవంబర్ 2015న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా నిలిచింది. బలమైన పాయింటే తీసుకున్నా.. ఆసక్తి కలిగించని సన్నివేశాలతో, పేలవమైన కథనంతో సాగడం వల్ల ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలం అయింది. దీంతో బిగ్ హిట్ అవుతుందనుకున్న ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచి నిర్మాత నితిన్కు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా విడుదల తరవాత నితిన్ చేతులు గట్టిగానే కాలాయి.