సాధారణంగా ఏ సినిమాకు అయినా హీరో, హీరోయిన్లే కీలకం. వారి జోడీ సెట్ అవ్వకపోతే.. మొత్తం సినిమానే బెడిసికొడుతుంది. అందుకే దర్శకులు హీరోల సరసన హీరోయిన్లను ఎంపిక చేసేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇకపోతే కొన్ని కొన్ని సినిమాల్లో హీరో, హీరోయిన్ల మధ్య వయసులో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసం మూడు, నాలుగేళ్లు ఉంటే పర్వాలేదు. కానీ, ఇరవై ముప్పై ఏళ్ల తేడా ఉన్నా.. కొందరు హీరో, హీరోయిన్లు జత కట్టారు. మరి వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
నాగార్జున-నయనతార: ఆన్ స్క్రీన్పై అద్భుతమైన కెమిస్ట్రీని పండించి ప్రేక్షకులను మెప్పించిన జోడీల్లో నాగార్జున, నయనతార జంట ఒకటి. వీరిద్దరూ కలిసి బాస్, గ్రీకువీరుడు చిత్రాల్లో కలిసి నటించారు. అయితే నాగార్జున, నయనతారల మధ్య 25 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది.
మహేష్ బాబు-రష్మిక మందన్నా: అనిల్ రావిపూడి దర్శకత్వం వచ్చిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో తొలిసారి మహేష్, రష్మికలు జత కట్టారు. 2020లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ సినిమాలో మహేష్, రష్మికల జోడీ బాగానే ఆకట్టుకుంది. కానీ, మహేష్ కంటే వయసులో రష్మిక 21 సంవత్సరాలు చిన్నది.
చిరంజీవి-తమన్నా: 2019లో విడుదలైన సైరా నరసింహరెడ్డి మూవీలో చిరంజీవికి జోడీగా తమన్నా నటించింది. అలాగే ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భోళా శంకర్ సినిమాలోనూ వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు. అయితే వయసుతో చిరు, తమన్నాల మధ్య 35 ఏళ్ల వ్యత్యాసం ఉంది.
బాలకృష్ణ-ప్రగ్యా జైస్వాల్: మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తాజాగా తెరకెక్కించిన `అఖండ` చిత్రంలో బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్లు తొలిసారి జోడీ కట్టారు. డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఇక వయసు విషయానికి వస్తే.. బాలయ్య కంటే ప్రగ్యా 31 సంవత్సరాలు చిన్నది.
రవితేజ-పాయల్ రాజ్పూత్: డిస్కో రాజా మూవీలో రవితేజకు జోడీగా పాయల్ రాజ్పూత్, నభా నటేష్లు నటించారు. అయితే రవితేజ కంటే వయసులో పాయాల్ 24 సంవత్సరాలు, నభా నటేష్ 27 సంవత్సరాలు చిన్నవాళ్లు.