అందాల ముద్దుగుమ్మ సమంత, నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో సమంతకు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే సమంత, అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి పెళ్ళాడింది, కాకపోతే వీరిద్దరికీ కొంతకాలం క్రితమే విడాకులు అయ్యాయి.
విడాకులు అయిన తర్వాత సమంత తన సినిమాల స్పీడ్ ను మరింత పెంచింది, సమంత ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తూనే మరి కొన్ని సినిమాలను కూడా లైన్ లో పెడుతోంది, అయితే ఇప్పటికే శాకుంతలం సినిమాతో ఫుల్ బిజీ గా సమంత, ఒక హాలీవుడ్ సినిమాలో కూడా నటించడానికి రెడీ గా ఉంది, అలాగే సమంత పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లను కూడా సెట్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి, ఇది ఇలా ఉంటే సమంత మరో క్రేజీ సినిమా అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలా వైకుంఠపురం లో లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి, కాకపోతే ఆ సినిమా ప్రారంభం కాలేదు, ఆ తర్వాత మహేష్ బాబుతో, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయబోతున్నాడు అని కూడా వార్తలు వచ్చాయి, అయితే ఇంకనూ ఈ సినిమా కూడా ప్రారంభం కాలేదు, ఒకవేళ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా వచ్చినా కూడా ఇంకాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి, అయితే ఆ గ్యాప్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్, సమంత తో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇది ఇలా ఉంటే ఇది వరకే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అ ఆ సినిమాలో సమంత నటించింది.