రాధేశ్యామ్ కు డావిన్సీ ఓడ సెంటిమెంట్ !

Seetha Sailaja
అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈపాటికి  `రాధేశ్యామ్`. థియేటర్స్ లో సందడి చేస్తూ ఉండేది. ఈ మూవీ కథ కోసం దర్శకుడు రాధా కృష్ణకుమార్ సంవత్సరాల తరబడి శ్రమించామని ఇండియన్ సినిమా చరిత్రలో ఈ స్థాయిలో స్టోరీ పై రీసెర్చ్ చేసి తీసిన సినిమా ఏదీలేదని ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో  రాధా కృష్ణ కుమార్ చేసిన కామెంట్స్ తో ప్రభాస్ అభిమానులలో ఈ మూవీ పై మరింత అంచనాలు పెరిగాయి.  

దీనికితోడు ఈమూవీ ట్రైలర్ సినిమా పై అంచనాల్ని మరింతగా పెంచేసింది. ఇటలీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో ప్రభాస్ పామిస్ట్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ‘ప్రేమించిన ప్రేమే ప్రేమని అంతం చేస్తే’ అనే కాన్సెప్ట్  తో ఈమూవీని తీసారని ప్రచారం జరుగుతోంది. ఇటలీలో కీలక ఘట్టాలని చిత్రీకరించిన ఈ చిత్రబృందం  కొన్ని ప్రధాన సన్నివేశాలని  భాగ్యనగరంలోని ఫలక్ నూమా ప్యాలెస్ లో కూడ తీసారు.  

ఈమధ్య  విడుదలచేసిన ఈమూవీ ట్రైలర్ చాల ప్రశ్నలకు అవకాశం ఇస్తూ ఈ మూవీ కథ పై అనేక ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పలు ఆసక్తికర సంఘటనలని మేళవించి ఈ చిత్రాన్ని తీసినట్లు ప్రచారం జరుగుతోంది. ట్రైలర్ లో చూపించిన ఓడ డావిన్సీ ఓడ అని  అంటున్నారు. చరిత్రలో డావిన్సీ ఓడ ప్రమాదానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అదేవిధంగా ఇటలీలో మిస్సయిన ట్రైన్ యాక్సిడెంట్ ని కూడ ఇందులో చేర్చి ఓ అందమైన ప్రేమకు అడ్డంకులు సృష్టించిన విధి నేపథ్యంలో ఈ మూవీ కథ నడుస్తుంది అంటున్నారు.

ముఖ్యంగా ట్రైలర్ లో చూపించిన ఓడ ప్రమాదానికి సంబంధించిన సన్నివేశాలు డావిన్సి ఓడ ప్రమాదాన్ని గుర్తుకు చేసేవిగా ఉంటాయని అంటున్నారు. దీనితో డావిన్సీ ఓడకు ‘రాధే శ్యామ్’ కథకు ఉన్న సంబంధం ఏమిటి అన్న విషయమై ఇప్పుడు సోకాల్ మీడియాలో అనేక  ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: