పాపం:బతికి ఉన్న నటి.. చంపేసిన సోషల్ మీడియా. !!

Divya
 కొంతమంది నటీమణులు.. ఎంతో బాగా స్టార్ పొజిషన్ లో ఉన్నప్పుడు.. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు. కానీ కాస్త స్టార్ డమ్ తగ్గిన వెంటనే.. వారిని మర్చిపోతూ ఉంటారు. అలా అడపదడప సినిమాలలో నటిస్తూ ఉండే నటులు కొన్ని సంవత్సరాలుగా కనిపించకుండా ఉంటే.. ఇక వారి నుంచి ఊహించని విధంగా కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి. అలా ఇబ్బంది పడిన ఒక నటి గురించి మనం తెలుసుకుందాం.
తాజాగా కొద్ది రోజుల క్రితం మలయాళం నటి భామ ఒకరు ఆత్మహత్య చేసుకుంది అన్నట్లుగా సోషల్ మీడియాలో బాగా వార్తలు బయటకు వచ్చాయి.. ఏమైందా అని అందరూ ఆరా తీసే లోపు.. అలా నేను ఆత్మహత్య చేసుకోలేదు.. అంటూ ఆ నటి షాక్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఆమె చెప్పిన ఈ మాటలు తెగ వైరల్ గా అవుతున్నాయి..అసలు విషయంలోకి వెళితే 2017వ సంవత్సరంలో వేధింపుల కేసులో తిరిగి విచారిస్తున్నారు అని భయంతో ఈ ముద్దుగుమ్మ ఆత్మహత్యకు పాల్పడింది అంటూ సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి విషయంపై ఈ భామ స్పందించి.. నాపై వస్తున్న ఈ పుకార్లులలో ఎలాంటి వాస్తవం లేదు అని తెలియజేసింది. నా గురించి ఎవరు భయపడవద్దు.. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను.. మీరు చూపిస్తున్న ఈ ప్రేమ అభిమానాలకు ధన్యవాదాలు అని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.
దీంతో ఈ ఆత్మహత్య వార్త కాస్త కనుమరుగైంది అని చెప్పవచ్చు. తొలిసారిగా నైవేద్యం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది భామ. ఆ తరువాత ఎన్నో సినిమాలలో కూడా నటించింది.. 2020 వ సంవత్సరంలో దుబాయ్ కు చెందిన ఒక వ్యాపారవేత్త అరుణ్ ను వివాహం చేసుకుంది. దీంతో సినిమాలకు దూరమైంది. ఇక గత సంవత్సరం ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఈ ముద్దుగుమ్మ .. సోషల్ మీడియాలో వచ్చే కథనాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని రాయండి అంటూ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: