సోలోగా సత్తా చాటుతా.. మల్టీస్టారర్ పై బన్నీ షాకింగ్ కామెంట్స్.. .
అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 అంచనాలకు మించి వసూళ్లను రాబట్టింది. నార్త్ సైడ్ పుష్ప సినిమాని ఓ రేంజ్ లో అక్కడ ఆడియెన్స్ ఆదరించారు. అందుకే ఇక మీద తన సినిమాలన్ని పాన్ ఇండియా లెవల్ లో ప్లాన్ చేస్తున్నాడట అల్లు అర్జున్. అసలైతే పుష్ప తర్వాత దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరాం తో ఐకాన్ సినిమా ఉండాల్సింది. కానీ ఆ సినిమా వస్తుందా రాదా అన్న క్లారిటీ మాత్రం లేదు. ఇక పుష్ప పార్ట్ 2 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక ఇదిలాఉంటే అల్లు అర్జున్ అట్లీ కాంబోలో ఓ పాన్ ఇండియా సినిమా వస్తుందని చెబుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుందట. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ కి 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందిస్తారని టాక్. చూస్తుంటే అల్లు అర్జున్ కూడా ప్రభాస్ తరహాలో నేషనల్ లెవల్ లో ఓ రేంజ్ స్టార్ గా మారే అవకాశం కనిపిస్తుంది. అల్లు అర్జున్ ప్లాన్ చూస్తుంటే పాన్ ఇండియా స్టార్ గా తన వీర లెవల్ రేంజ్ చూపించేలా ఉన్నాడని తెలుస్తుంది.