ఇదేమి ట్విస్ట్ స్వామి : మాస్ రాజా ఖిలాడీ వాయిదా .... కారణం అదేనా .... ??

GVK Writings
మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రస్తుతం మొత్తం నాలుగు సినిమాలు సెట్స్ మీద ఉండగా వాటిలో ఇప్పటికే ఖిలాడీ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. తనతో గతంలో వీర వంటి మాస్ మూవీ తీసిన రమేష్ వర్మ తో మరొక్కసారి ఖిలాడీ ద్వారా జత కట్టారు రవితేజ. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఉన్ని ముకుందన్, నీకితిన్ దీర్, సచిన్ ఖేడేకర్, ముఖేష్ ఋషి, మురళి శర్మ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ సినిమా మంచి మాస్ యాక్షన్ తో కూడిన కమర్షియల్ గా తెరకెక్కుతున్నట్లు టాక్.
ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్ కి ప్రేక్షకాభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తుండగా అర్జున్ సర్జ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే, వాస్తవానికి తమ సినిమాని ఫిబ్రవరి 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో రిలీజ్  ప్రకటించింది యూనిట్. మరోవైపు సినిమా నుండి ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేస్తూ మరింతగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక వారం రోజుల పాటు వాయిదా పడే ఛాన్స్ కనబడుతోందని అంటున్నారు.
దానికి కారణం సినిమాలో హీరో రవితేజ సీన్స్ కి సంబంధించి డబ్బింగ్ ఇంకా ప్రారంభం కాలేదని టాక్. అయితే రవితేజ కొన్ని పర్సనల్ కారణాల వలన ఇంకా డబ్బింగ్ చెప్పలేదని, అది ఆలస్యం కావడం వల్లనే సినిమాని ఒక వారం పాటు టీమ్ వాయిదా వేయనుందని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్త ప్రకారం నిజంగానే మాస్ మహారాజ రవితేజ ఖిలాడీ వాయిదా పడుతుందా లేదా అనేది తెలియాలి అంటే దీనిపై యూనిట్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: