ప్రభాస్ ఆ పనిచేసేలా చేసిన దిల్ రాజు!!

P.Nishanth Kumar
ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యాం చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. మార్చి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేయాలని హడావుడిగా పని చేస్తోంది చిత్ర యూనిట్.  జనవరి 12 వ తేదీన ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో ఈ చిత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది.

ఈసారైనా ఈ చిత్రం తప్పకుండా విడుదలై ప్రేక్షకుల నుండి అలరిస్తుందని అని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మార్పు విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. మొదట్లో ఈ చిత్రానికి రాదే శ్యామ్ అనే చిత్రం టైటిల్ అనుకోలేదు అన్న విషయం అందరికి తెలిసిందే. కొన్నిరోజులు జాన్ అనే పేరుతో పిలిచారు అయితే అదే సమయంలో దిల్ రాజు ఎంట్రీ ఇచ్చి ఈ సినిమా టైటిల్ ను మార్చివేశాడు.

తమిళ సినిమా పరిశ్రమలో సూపర్ హిట్ అయినా 96 సినిమా తెలుగులో శర్వానంద్ మరియు సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కగా దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో మాత్రం మెప్పించ లేకపోయింది అయితే ఈ చిత్రానికి జాను అనే టైటిల్ ను పెట్టడం రాధే శ్యామ్ చిత్రం పట్ల శాపంగా మారింది. తప్పకుండా ఈ సినిమా టైటిల్ మార్చి విడుదల చేయాల్సిన అవసరం కావడంతో కొత్త సినిమా టైటిల్ కోసం ఎదురు చూసి చివరకు ఈ చిత్రం టైటిల్ ను రాధే శ్యామ్ గా పెట్టారు. అయితే ఈ టైటిల్ ఎంతో క్లాస్ గా ఉండడం తో అందరు దీనిపై కొంత నెగెటివ్ గా ఉన్నారు. అయితే ఈ చిత్ర ట్రైలర్ చూశాకా ఈ సినిమా కి తగ్గ టైటిల్ పెట్టారు అని అందరు అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: