ఆ ఆటతో అన్ని కోట్లు సంపాదించవచ్చా..!
అమ్మాయిలు క్రికెట్ గురించి పెద్దగా ఆలోచించని టైమ్లోనే బ్యాట్ పట్టి, కల సాకారం చేసుకున్న క్రికెటర్ మిథాలీ రాజ్. కెప్టెన్గా ఇండియన్ విమెన్ క్రికెట్ టీమ్ని దశాబ్ధాల నుంచి నడిపిస్తోన్న మిథాలీ కథాంశంతోనూ సినిమా వస్తోంది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో 'శభాష్ మిథు'గా వస్తోన్న ఈబయోపిక్లో తాప్సీ టైటిల్ రోల్ ప్లే చేస్తోంది. ఇండియన్ క్రికెట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు సౌరవ్ గంగూలి. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఇండియన్ క్రికెట్ని నడిపిస్తోన్నగంగూలీ కథాంశంతోనూ సినిమా వస్తోంది. లవ్ రంజన్ నిర్మాణంలో గంగూలీ బయోపిక్ వస్తోంది. ఈ క్రికెట్ కథలో రణ్బీర్ కపూర్, విక్కీ కౌశల్, సిద్ధార్థ్ మల్హోత్రాల్లో ఎవరో ఒకరు టైటిల్ రోల్ ప్లే చేస్తారనే ప్రచారం జరుగుతోంది. హాకీ భారతదేశపు జాతీయ క్రీడ. కానీ మనదేశంలో క్రికెట్కే ఎక్స్పోజర్ ఎక్కువ. గల్లీ నంచి కార్పొరేట్ బ్రాండ్స్ వరకు అన్నీ క్రికెట్ చుట్టూనే తిరుగుతుంటాయి. అయితే ఇంత వ్యాపారం జరుగుతున్నా, ఇండియాకి రెండు సార్లు మాత్రమే వన్డే వరల్డ్ కప్స్ వచ్చాయి. కానీ విజయాలతో సంబంధం లేకుండా రిచ్చెస్ట్ క్రికెట్ బోర్డ్గా నిలిచింది బిసీసీఐ. ఇప్పుడు బిసిసిఐ లాగే బాక్సాఫీస్ కూడా ఫుల్రిచ్గా మారాలని క్రికెట్ కథలవైపు వెళ్తోంది.
మహేంద్ర సింగ్ ధోనీకి ఇండియన్ క్రికెట్ హిస్టరీలో స్పెషల్ ఇమేజ్ ఉంది. 'టీ-20, వన్డే వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ' అందించిన కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. ఈ సక్సెస్ఫుల్ కెప్టెన్ కథని నీరజ్ పాండే 'ఎమ్.ఎస్.ధోనీ-ది అన్టోల్డ్ స్టోరీ' పేరుతో తెరకెక్కిస్తే సూపర్ హిట్ అయింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ని వెండితెర ధోనీగా మార్చింది. ఇండియన్ క్రికెట్గాడ్గా పేరు తెచ్చుకున్న హీరో సచిన్ టెండూల్కర్. వన్డే వరల్డ్ కప్ని ముద్దాడేవరకు టీమ్తోనే ట్రావెల్ చేసిన సచిన్కి కోట్లమంది అభిమానులున్నారు. ఈ మాస్టర్ బ్లాస్టర్ కథని 'సచిన్-ఏ బిలియన్ డ్రీమ్స్' పేరుతో తెరకెక్కించారు. ఇందులో సచిన్ కూడా నటించాడు. అయితే క్రికెట్ గ్రౌండ్లో వేల పరుగులు సాధించిన సచిన్ బాక్సాఫీస్ దగ్గర ఆరేంజ్లో మెప్పించలేకపోయాడు.