టాలీవుడ్ యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ యంగ్ హీరో బుచ్చిబాబు సన దర్శకత్వంలో కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు, పంజా వైష్ణవ్ తేజ్ ఇండస్ర్టీ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా తోనే వంద కోట్ల కలెక్షన్ లను సాధించి మొట్ట మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇలా మొదటి సినిమా తోనే అదిరిపోయే విజయాన్ని అందుకున్న ఈ మెగా హీరో ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ తెరకెక్కిన కొండపొలం సినిమాలో హీరోగా నటించాడు, క్రిష్ జాగర్లమూడి పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు సినిమాను పక్కన పెట్టి మరి కొండాపొలం సినిమాను తెరకెక్కించడం తో కొండాపొలం సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అలా ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన కొండాపొలం సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది, ఇలా మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని రెండో సినిమాతో బ్లాక్ బాక్స్ ఆఫీస్ ప్లాప్ ను ఎదుర్కొన్న పంజా వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం రంగ రంగ వైభవంగా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హాట్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాకు విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ తో ‘ఆదిత్యవర్మ’ (అర్జున్ రెడ్డి తమిళ రీమేక్) తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్న గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే రంగ రంగ వైభవంగా సినిమా షూటింగ్ పూర్తయినట్లు తాజాగా చిత్ర బృందం తెలియజేసింది, షూటింగ్ పూర్తైంది, మిమ్మల్ని ప్రేమలో పడేసేందుకు త్వరలో మీ ముందుకొస్తున్నాం’ అంటూ చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.