పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎ రేంజ్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, వీరిద్దరి కాంబినేషన్ లో ఇది వరకే జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమా తెరకెక్కాయి. ఈ మూడు సినిమాల్లో జల్సా సినిమా మంచి విజయన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించగా, అత్తారింటికి దారేది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయం సాధించడం, మాత్రమే కాకుండా కలెక్షన్ ల వర్షం కురిపించింది, ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు మంచి విజయాలు సాధించడంతో అజ్ఞాతవాసి సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు, కాకపోతే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలు మాత్రమే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన భీమ్లా నాయక్ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ను అందించడం జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే, ఇది ఇలా ఉంటే మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి, ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ లైన్ ను చెప్పడం దానికి పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయినట్టు తెలుస్తుంది.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే చాలా శాతం షూటింగ్ పూర్తి అయిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను పవన్ కళ్యాణ్ ఈ నెల 18 వ తేదీ నుండి తిరిగి ప్రారంభించబోతున్నడు, ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడు, ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడు, ఈ సినిమాలు పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.