కోలీవుడ్ ఇండస్ట్రీలో గెలిచిన స్టార్ హీరోలు వీళ్లే ..!!

Divya
తమిళ నటుల సంఘమైన నడిగర్ సంఘం ఎన్నికలు నిన్నటి రోజున జరగడం జరిగింది. ఎన్నికలలో హీరో విశాల్ మరియు కార్తిక్ గెలవడం జరిగింది. నడిగర్ సంఘం నాయకుడిగా నాజర్ విజయాన్ని సాధించారు. సీనియర్ నటుడు అయిన నాజర్ సుదీర్ఘకాలంగా తమిళం ఇండస్ట్రీ లోనే కొనసాగుతూ ఉన్నారు. సీనియర్ గా ఆయనకు మంచి పేరు ఉంది అందుకే అక్కడి వారు ఆయనను ఎన్నుకోవడం జరిగింది. ఇక ఈ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా హీరో విశాల్ గెలవడం జరిగింది. విశాల్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు రెండవసారి చేపట్టబోతున్నారు.
అలాగే మరో హీరో కార్తీక్ కూడా ట్రెజరర్ పోటీ నుంచి గెలిచి విజయాన్ని అందుకున్నాడు. నడిగర్ సంఘం చివరిసారిగా జరిగిన ఎన్నికలు చాలా రసవత్తరంగా జరిగాయి. పోలీస్ కేసు మొదలు కావడం తో ఎంతో హడావిడి గా కొనసాగాయి. కానీ ఈ సారి మాత్రం చాలా సింపుల్ గానే ఎన్నికలు ముగిసినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలలో గెలుపొందిన కార్యవర్గం వెంటనే బాధ్యతలను స్వీకరించడం మొదలుపెట్టారు. నడిగర్ సంఘం కోసం విశాల్ చేసిన కృషికిగాను ఆయనను అక్కడి నుండి కొంత మంది నటీనటులు ఓట్లు వేసి గెలిపించుకున్నారు అని చెప్పవచ్చు. ఇక అక్కడ విశాల్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంవల్ల ఈయన పేరు బాగా మారుమ్రోగుతోంది.
ఇక గతంలో కూడా తెలుగు సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన విషయం అందరికీ తెలిసినదే. ఆ ఎన్నికలు ఎంతో హడావిడిగా జరిగినప్పటికీ చివరికి మంచు విష్ణు గెలవడం జరిగింది. ఈ ఎన్నికలతో పోల్చుకుంటే కోలీవుడ్ ఎన్నికలు చాలా హడావుడిగా జరగాలి అనుకున్నారు. ఎందుచేత అంటే వివాదాలు గొడవలు కూడా చాలానే ఉంటాయి ఏమో అన్నట్లుగా వార్తలు వినిపించాయి. కానీ అలాంటివి ఏవి అక్కడ జరగలేదు మరీ ముఖ్యంగా లోకల్ నాన్ లోకల్ అనే పదం కూడా వినిపించలేదు. ఏది ఏమైనా సజావుగా గెలవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: