టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో గోపీచంద్ ఒకరు, గోపీచంద్ హీరోగా తన కెరియర్ ని మొదలు పెట్టినప్పటికీ విలన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు, జయం , వర్షం , నిజం సినిమాలలో విలన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో విలన్ గా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గోపీచంద్ ఆ తర్వాత యజ్ఞం సినిమాతో హీరోగా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత నుండి గోపీచంద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నాడు. యజ్ఞం మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న గోపీచంద్ ఆ తర్వాత నటించిన చాలా సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో ప్రస్తుతం కూడా గోపీచంద్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు, ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం గోపిచంద్ 'సిటి మర్' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు, మహిళా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన సీటీమార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.
ఇలా సిటి మార్ మూవీ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు, ఈ మూవీ లో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా పక్కా కమర్షియల్ చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది, ఈ సినిమాను జులై 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది. ఈ మూవీ కి బన్నీ వాసు నిర్మాత , యూవీ క్రియేషన్స్, జీఏ (గీతా ఆర్ట్స్) 2 పిక్చర్స్ పతాకాలపై ఈ మూవీ తెరకెక్కుతుంది, ఇది ఇలా ఉంటే గోపిచంద్ ఈ సినిమాతో పాటు శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తున్నాడు.