టాలీవుడ్ హీరో గోపీచంద్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, వరుస అపజయలతో బాక్స్ ఆఫీస్ దగ్గర డీలపడిపోయి ఉన్న గోపీచంద్ కొన్ని రోజుల క్రితం విడుదలైన సిటిమార్ మూవీ తో మంచి సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. సీటి మార్ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించగా, ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది, మహిళా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన సిటిమార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. సిటిమార్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు, ఈ మూవీ లో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది, పక్కా కమర్షియల్ మూవీ తో పాటు గోపీచంద్ , శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో నటిస్తున్నాడు.
ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న గోపీచంద్ మరో క్రేజీ మూవీ ని లైన్ లో పెట్టి నట్లు తెలుస్తోంది, మాస్ మొవీల దర్శకుడిగా పేరున్న 'హరి' కి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తమిళ ఇండస్ట్రీ లో సింగం 1 , 2 ,3 సినిమాలతో దర్శకుడిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హరి దర్శకత్వం లో గోపీచంద్ ఒక సినిమాలో నటించబోతున్నట్లు ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది, టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ హీరోగా గుర్తింపు ఉన్న గోపిచంద్ తో కోలీవుడ్ లో మాస్ దర్శకుడిగా గుర్తింపు పొందిన హరి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది, ఇది ఇలా ఉంటే ఇటీవలే గోపీచంద్ ను కలిసిన హరి ఒక కథను గోపీచంద్ కు వినిపించడం, ఆ కథకు గోపిచంద్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయినట్లు తెలుస్తోంది.