టాలీవుడ్ ఇండస్ట్రీ లో తొలి తరం సూపర్ స్టార్ కృష్ణ.అయితే ఆతరంలో తెలుగు సినీ పరిశ్రమను ఏలిన వారిలో కృష్ణ ఒకరు. వృధాప్యంలో ఉన్న కృష్ణ రీసెంట్ లుక్ ఫ్యాన్స్ ను భయపెట్టింది.ఇక తెలుగు సినీ పరిశ్రమను శాసించిన అలనాటి స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. అయితే ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావుల హవా కొనసాగుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కృష్ణ అప్పట్లో దూసుకుపోయారు.ఇకపోతే ఆ రోజుల్లో కృష్ణకు ఉన్నన్ని అభిమాన సంఘాలు మరెవరికీ లేవు.కాగా ఎన్టీఆర్, ఏఎన్నార్ ల హవాను తగ్గించి, ఆ ఊపులో హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించుకున్నారు కృష్ణ.
తాజాగా ఇప్పుడు ఆయన వారసత్వం తీసుకున్న మహేష్ బాబు, కృష్ణ తరువాత టాలీవుడ్ లో సూపర్ స్టార్ బిరుదును కూడా పొందారు.అయితే కృష్ణ ఇప్పుడు వయోభారంలో ఉన్నారు.ఇక ఆయన ఇంటివద్దే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.ఇకపోతే ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లలో కనిపించడం తప్ప ఎక్కువగా ఎక్కడా కనిపించడం లేదు. అయితే అసలు విషయం ఏంటంటే రీసెంట్ గా కృష్ణకు సంబంధించిన ఒక ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది.అంతేకాదు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.అయితే ఇటీవలే తమ కుటుంబానికి సంబంధించిన ఒక ఫంక్షన్లో ఆయన పాల్గొన్నారు.
ఇక దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలను కృష్ణ కూతురు, మహేశ్ బాబు అక్క మంజుల సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇకపోతే ఈ ఫొటోలో కృష్ణ మొహంలో ఏదో తేడాగా కనిపిస్తుండటంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు సూపర్ స్టార్ కృష్ణ గారికి ఏమైందా అంటూ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దీని పై సూపర్ స్టార్ ఫ్యామిలీ ఎలాంటి రెస్పాన్స్ ని ఇవ్వలేదు. దీంతో అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ గారి ఆరోగ్యం విషయంలో తెగ కంగారు పడుతున్నారు. మరి అభిమానుల కోసం అయినా సూపర్ స్టార్ ఫ్యామిలీ కృష్ణ గారి ఆరోగ్యంపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి...!!