తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ హక్కులు ఎవరికీ దక్కాయో తెలుసా?
సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్ హీరోగా నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై ఆర్ మహేంద్రన్తో కలిసి నిర్మించారు కూడా. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ పవర్ ఫుల్ పాత్రలలో నటిస్తుండగా.. హీరో సూర్య అతిథి పాత్రలో అలరించనున్నారు. ఈ చిత్రం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈ చిత్ర రైట్స్ని.. టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ సంస్థ సొంతం చేసుకుంది.
టాలీవుడ్ వెర్సటైల్ స్టార్ నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఫ్యాన్సీ ధరకు 'విక్రమ్' తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకుంది. టాలీవుడ్లోని ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థలలో ఒకటైన శ్రేష్ట్ మూవీస్.. ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకోవడమే కాకుండా.. సినిమాకి సంబంధించి భారీ ప్రమోషనల్ కార్యక్రమాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే, భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు శ్రేష్ట్ మూవీస్ సన్నాహాలు చేస్తుంది..కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ వంటి వారు ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర ల్లో నటిస్తున్నారు.. అందుతున్న సమాచారం ప్రకారం సినిమా హిట్ అనే టాక్ గుస గుసలు వినిపిస్తున్నాయి.. మరి ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..