ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఇంత మంచి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ (Yash) కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు యశ్ మూడేళ్ల కింది వరకు కేవలం కన్నడలోనే స్టార్ హీరో. ఇకపోతే ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా ఎదిగారు.కాగా కెజియఫ్తో రికార్డ్స్ను బ్రేక్ చేసిన యశ్ .అయితే ఇప్పుడు కెజియఫ్ 2 మూవీతో పలకరించిన సంగతి తెలిసిందే. అంతేకాదు భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్లో టాక్ తెచ్చుకుంది.
ఇదిలావుంటే పాత రికార్డ్స్ను బద్దలు కొడుతూ కొత్త రికార్డ్స్ను క్రియేట్ చేస్తోంది. అయితే అది అలా ఉంటే ఈ సినిమా బాహుబలి-2 రికార్డును బ్రేక్ చేసిందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా ఇప్పటికే రూ.1,200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా.. ఇక తాజాగా కెజియఫ్ 2 బుక్ మై షో బుకింగ్స్లో అత్యధిక టికెట్లు కొనుగోళ్లు జరిపిన సినిమాగా ఆల్టైమ్ న్యూ రికార్డ్ సృష్టించింది. అయితే మొత్తం 17.1 మిలియన్ల టికెట్స్ అమ్మకాలు జరగడంతో ఇప్పటివరకూ ఉన్న బాహుబలి- 2 బుకింగ్స్ రికార్డ్ను కెజియఫ్ 2 బ్రేక్ చేసిందని తెలుస్తోంది. కలెక్షన్స్ విషయంలో మాత్రం బాహుబలి-2నే రూ.1,429.83కోట్లతో టాప్లో ఉందని తెలుస్తోంది.కాగా కెజియఫ్ 2 కలెక్షన్స్ విషయానికి వస్తే.. బాక్స్ ఆఫీస్ దగ్గర కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా మొత్తం మీద 6 వారాలను పూర్తీ చేసుకుని ఇప్పుడు 7వ వారంలో అడుగు పెట్టింది.
అయితే మొత్తం మీద సినిమా 43 వరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 20 లక్షల షేర్ని 55 లక్షల రేంజ్లో గ్రాస్ను కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఈఇదిలావుండగా ఓవరాల్గా 43 రోజులు పూర్తీ అయ్యే సమయానికి ఈ సినిమా టోటల్గా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 84.08 కోట్ల షేర్ను 136.54 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది.అయితే 43 రోజుల్లో వరల్డ్ వైడ్గా ఈ సినిమా 600.52 కోట్ల షేర్ని 1229.15 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ఇక ఈ విషయం పక్కన పెడితే కెజియఫ్ చాఫ్టర్ 3 ప్రాజెక్టు ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు.అంతేకాదు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్తో సలార్ చేస్తున్నారు.ఇక అది పూర్తవ్వగానే ఈ సినిమా ఉండనుందట.