టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన సినిమా ఆచార్య.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కీరోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే. కాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి.అయితే భారీ అంచనాల మధ్య గత నెలలో రీలిజైన చిరంజీవి సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ప్లాప్ అయింది.అంతేకాదు ఈ సినిమాలో ఓ కీలకమైన సన్నివేశంలో నటించి మెప్పించింది సింగర్ ఎంఎల్ శృతి.. చిరంజీవి పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తన ఇన్స్టాగ్రామ్లో వెల్లడించడం జరిగింది.
ఇకపోతే చిన్నప్పటి నుండి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని, అంతేకాదు అలాంటిది ఇప్పుడు ఆయన పక్కనే నటించే ఛాన్స్ రావడం, మరియు ఆయనతో కొద్దిసేపు మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.ఇకపోతే ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కొరటాల శివకి ధన్యవాదాలు తెలిపింది. అయితే టాలీవుడ్లో సింగర్ గా మంచి పేరు తెచ్చుకుంది శృతి.దేనితో పాటుగా గతేడాది బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ సినిమాలో 'అడిగా అడిగా' అంటూ సాగే ఈ ఫీల్గుడ్ మెలోడిని పాడింది. అయితే ఈమె నటుడు జయంత్ ని వివాహం చేసుకుంది.
ఇక ప్రస్తుతం చిరంజీవి సినిమాల విషయానికొస్తే మోహన్ రాగ దర్శకత్వంలో గాడ్ఫాదర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాతో పాటు బాబి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . ఇక ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తున్నట్లుగా ఇప్పటికే వార్తలు వినిపించాయి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఇక ఈ సినిమా షూటింగ్ కోసం సుమారు 20 రోజుల పాటు మలేషియాకు వెళ్ళిపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి . movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది.