సూపర్ స్టార్ మహేశ్ బాబు కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు....అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు ఏంటి?... సినిమా టిక్కెట్లు కోసం లైన్ల నిలబడటం ఏంటి? అని అందరూ ఆశ్చర్యపోతున్నారా...అయితే ఇది నిజమే.ఇకపోతే ఆయన 'తన 'సర్కారు వారి పాట' సినిమా చూడ్డానికో, మరో చిత్రాన్ని చూడటానికో అలా చేయలేదు. ఇక మహేశ్ నిర్మించిన 'మేజర్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే ఆయన ఓ థియేటర్ ముందు క్యూలో నిలబడి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా యూట్యూబర్, డిజిటల్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం తో కలిసి సూపర్ స్టార్ వినూత్నంగా మూవీని ప్రమోట్ చేశారు.ఇదిలావుంటే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది.
అయితే వీడియో ఓపెన్ చేసి చూస్తే ....నిహారిక సినిమా టికెట్ కోసం లైన్లో నిలబడుతుంది.ఇక ఇంతలో ఆమె ముందుకు ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు.అలానే మధ్యలో మూవీ హీరో అడివి శేష్ రాగానే వారిద్ధరి మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడే ఈలోపు నిహారిక ముందు మహేశ్బాబు వచ్చి క్యూలో నిలబడతారు.అప్పుడు ''మా ఫ్రెండ్స్ ను కూడా పిలవొచ్చా'' అని మహేశ్ అడగ్గానే..ఆమె ఓకే అంటుంది.ఇకపోతే ఫోన్ నంబర్ అడిగే లోపు సూపర్ స్టార్ వెళ్లిపోవడంతో నిహారిక అసహనం వ్యక్తం చేస్తుంది.
ఇక దీంతో వీడియో ఎండ్ అవుతుంది.అయితే అడివి శేష్ హీరోగా డైరెక్టర్ శశికిరణ్ తిక్క తెరకెక్కిస్తున్న చిత్రం 'మేజర్'. కాగా ముంబయి ఉగ్రదాడుల్లో ప్రాణాలు విడిచిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా ఈ మూవీ రూపొందుతుంది.అంతేకాదు ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ సంస్థలతో కలిసి జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్ బాబు ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది.ఇక ఈ మూవీని తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.