పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బాపుబొమ్మ.. ఫోటోలు వైరల్ ..!!
తన బిడ్డను చూసుకుంటూ మాతృత్వపు మాధుర్యం తో మురిసిపోతోంది ప్రణీత.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు సైతం ఆమెకు అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏం పిల్లో ఏం పిల్లడో వంటి సినిమాతో మొదటి సారిగా టాలీవుడ్ కు పరిచయం అయింది హీరోయిన్ ప్రణీత. ఆ తర్వాత హీరో సిద్ధార్థ తో కలిసి బావ చిత్రం లో నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత పవన్ తో కలిసి అత్తారింటికి దారేది సినిమాలో నటించడంతో ఇమే బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఇక తరువాత పాండవులు పాండవులు తుమ్మెద, రభస తదితర సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందింది. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారవేత్త నితిన్ రాజు ను గత సంవత్సరం వివాహం చేసుకున్నది. ఇక ఈ ఏడాది తన భర్త పుట్టినరోజు సందర్భంగా తను తల్లిని కాబోతున్నట్లు గా విషయాన్ని తెలియజేసింది ఆ తర్వాత తనకు సంబంధించి కొన్ని ఫోటోలు నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చింది ప్రణీత. తాజాగా తల్లి గా ప్రమోషన్ పొంది మాతృత్వపు మాధుర్యం లో మురిసిపోతోంది ఈ ముద్దుగుమ్మ. అందుకు సంబంధించి ఫోటో కూడా వైరల్ గా మారుతొంది.