ఇక రీసెంట్ గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న విక్రమ్ (Vikram) సినిమాతో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పేరు దేశావ్యాప్తంగా మరోసారి మారమోగుతోంది.లోకనాయకుడు కమలహాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా కూడా రికార్డు కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతోంది.అసలు భాషతో సంబంధం అనేదే లేకుండా విడుదలైన అన్ని చోట్ల కలెక్షన్ల కూడా వర్షం కురిపిస్తోందీ సినిమా. ఈ నేపథ్యంలోనే లోకేశ్ తన తర్వాతి ప్రాజెక్ట్పై అందరి దృష్టిపడింది. 2019 వ సంవత్సరంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘ఖైదీ’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.ఇక ఇదిలా ఉంటే లోకేశ్ ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డాడు. అలాగే ఈ సినిమా కూడా ఖైదీ టైటిల్తోనే తెరకెక్కనుంది.
ఈ నేపథ్యంలో తాజాగా లోకేశ్ ఈ సీక్వెల్కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఖైదీ సీక్వెల్పై ఓ క్లారిటీ ఇచ్చాడు.సినిమాలో హీరో జీవితం ఢిల్లీ జైలులో ఎలా గడిచింది అన్న కథాంశంతో ఈ సినిమా ఉండనున్నట్లు లోకేశ్ తెలిపాడు.ఇంకా సినిమా కథ గురించి మాట్లాడుతూ.. ‘ఫ్లాష్ బ్యాక్తో ఈ సినిమా మొదలు అవుతుంది. జైల్లో కబడ్డీ ఆడి ఎన్నో కప్పులు గెలిచే హీరో ఇక ఆ తర్వాత మాఫియా ముఠా నుంచి పోలీసులను కాపాడి తరువాత తన కూతురును తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత పోలీసులకు మళ్లీ హీరో అవసరం వస్తుంది. అసలు పోలీసులకు హీరోతో వచ్చిన అవసరం ఏంటి.?ఇక ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయి’ అన్నది సినిమా కథ అని చెప్పుకొచ్చాడు లోకేశ్. మరి విక్రమ్తో ఇండస్ట్రీని సొంతం చేసుకున్న యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఖైదీ సీక్వెల్తో ఎలాంటి వండర్స్ చేస్తారో చూడాలి.