దర్శకుడు సుజిత్ గురించి మనకి తెలిసిందే .ఈయన 'రన్ రాజా రన్'తో సాలిడ్ హిట్ కొట్టిన దర్శకుడు అన్నమాట. అంతేకాదు ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్న సంగతి మనందరం చూసాం.అయితే దర్శకుడు సుజిత్ తొలి సినిమాతో మంచి విజయం అందుకున్న అతడికి, మలి సినిమాలో ప్రభాస్ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం జరిగింది.అయితే దాని అనంతరం 'సాహో ' తీయడం జరిగింది.ఇకపోతే ఆ తర్వాత మరో సినిమా ఓకే కావడానికి ఆయనకి మూడేళ్ళు పట్టింది.ఇకపోతే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సుజీత్ సినిమా చేయనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తాజాగా తెలిసింది.
అయితే పవన్ కల్యాణ్ హీరోగా ఒక రీమేక్ మీద సుజీత్ కొన్ని రోజులు స్క్రిప్ట్ వర్క్ కూడా చేశారు. ఇకపోతే అది ముందు సెట్స్ మీదకు వెళుతుందా? ఇక లేదంటే వరుణ్ తేజ్ సినిమా ముందు స్టార్ట్ అవుతుందా? అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది.ఇక ఇదిలావుండగా 'సాహో' తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం యువ దర్శకుడు సుజీత్కు వచ్చింది.ఇకపోతే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న 'గాడ్ ఫాదర్' స్క్రిప్ట్ మీద ఆయన కొన్ని రోజులు వర్క్ చేశారు. ఇక ఆ తర్వాత ఎందుకో సుజీత్ దర్శకత్వంలో సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు.అయితే ఆ తర్వాత రామ్ చరణ్, సుజీత్ కలయికలో సినిమా అని వినిపించింది.
ఇక హిందీలో షారుఖ్ ఖాన్ హీరోగా సినిమా అని వినిపించింది. అయితే అదీ ఓకే కాలేదు. పవన్ కళ్యాణ్ సినిమా వర్క్ జరుగుతోంది. ఇకపోతే అది ఓ వైపు ఉండగా... వరుణ్ తేజ్ సినిమా ఓకే అయ్యింది. మెగాస్టార్తో మిస్ అయినా మెగా క్యాంప్లో మరో హీరోతో సినిమా చేసే అవకాశం అందుకున్నారు సుజీత్.ఇకపోతే వరుణ్ తేజ్ - సుజీత్ సినిమాను జీ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామ్యంతో మెగా ఫ్యామిలీకి చెందిన ప్రొడక్షన్ హౌస్ నిర్మించే అవకాశాలు ఉన్నట్టు తాజా సమాచారం ప్రకారం తెలుస్తోంది. అయితే మరీ కొన్ని రోజుల్లో ఈ సినిమాపై పూర్తి స్పష్టత రానుంది...!!