తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇండియన్ స్టార్ డైరెక్టర్స్లో ఒకరైన శంకర్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న తాజా సినిమా `ఆర్సీ 15` అనే సంగతి తెలిసిందే.అయితే ఇటీవలె ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చరణ్ చేస్తున్న చిత్రమిది.ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.అంతేకాకుండా అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ మరియు కీయార అధ్వాని లతోపాటు రాజోలు సుందరి అంజలి, నవీన్ చంద్ర, జయరామ్, సునీల్, శ్రీకాంత్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు.
ఇకపోతే శ్రీ వెంకటేశ్వర క్రియేన్స్ బ్యానర్పై ప్రముఖ బడా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్లు హై బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా తమన్ ఈ సినిమాకి స్వరాలు అందిస్తున్నారు.ఇకపోతే రామ్ చరణ్ కు ఇది 15వ ప్రాజెక్ట్ అన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే.. అందుకే ఈ సినిమా ఈ సినిమాని `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని గత ఏడాది సెట్స్ మీదకు తీసుకెళ్లారు. అయితే ఇప్పటికే కొంత షూటింగ్ కూడా పూర్తైంది. ఇకపోతే ఈ మూవీ టైటిల్ పై గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట చర్చ జరుగుతూనే ఉంది. ఇకపోతే మొదట ఈ మూవీకి `సర్కారోడు` అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
ఇక ఆ తర్వాత `అధికారి` టైటిల్ తెరపైకి వచ్చి వైరల్ అయింది. అయితే తాజాగా ఇప్పుడు మరో కొత్త టైటిల్ బయటకు వచ్చింది. ఇకపోతే అదే `సిటిజన్`. కథ పరంగా `సిటిజన్` టైటిల్ బాగా సెట్ అవుతుందని శంకర్ భావిస్తున్నారట. ఇదిలావుంటే మరోవైపు ఈ టైటిల్ నెట్టింట ట్రెండ్ అవుతుండటంతో.. ఇక చరణ్ అభిమానులు `సర్కారోడు`, `అధికారి` టైటిల్స్ కంటే `సిటిజన్` టైటిల్నే అదిరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మెగా అభిమానులు రామ్చరణ్ నటించబోయే ఈ 15వ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇక మరి `సిటిజన్` టైటిల్ నే ఖరారు చేస్తారా..లేదా.. అన్నది చూడాలి..!!