ఇక టాలీవుడ్ సీనియర్ హీరో విలక్షణ నటుడు నవ్వుల రారాజు రాజేంద్ర ప్రసాద్ ఇటీవలే తన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు. జూలై 19 వ తేదీన న తన పుట్టినరోజు సందర్భంగా 'ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు' సినిమా సెట్స్లో కేక్ కట్ చేశాడు.అయితే ఇక దీన్నంతటినీ కూడా తన కెమెరాలతో క్యాప్చర్ చేసింది ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ భార్య అయిన జుబేదా. తను సెట్స్లోకి వెళ్లి అందరినీ కూడా చాలా ఆప్యాయంగా పలకరించింది. ఇక ఈ సినిమా సెట్స్లో సీనియర్ నటి మీనా కూడా ఉండటంతో ఆమెను కూడా కలిసింది జుబేదా.నీకు నేను పెద్ద వీరాభిమానిని అంటూ మీనాతో మాటలు కలిపింది జుబేదా.ఇక గతంలో 'పెళ్లాం చెబితే వినాలి' సినిమా సమయంలో కలిశామని, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కలిశామని చెప్తూ చాలా సంతోషపడిపోయిందామె. పెళ్లాం చెబితే వినాలి సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసి 7వ తరగతి పరీక్షలు కూడా మానేసి మరీ మిమ్మల్ని కలిశానంటూ ఆనాటి జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంది జుబేదా.
ఇక ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు కలుద్దామన్నా సెట్ అవ్వలేదని చెప్పుకొచ్చింది. ఏదైతేనేం, ఇన్నాళ్లకు మీనా తన యూట్యూబ్కు చిక్కిందని అలీ భార్య ఎంతగానో సంబరపడిపోయింది. ఇక ఈ సందర్భంగా మీనా కూడా మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత తెలుగులో నటిస్తున్నానని చెప్పింది. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తొలిసారి యాక్ట్ చేస్తున్నానని కూడా ఆమె తెలిపింది. ఇంకా అలాగే తెలుగులో సినిమాలు చేయట్లేదని ఇప్పటికే ఆమెకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, తప్పకుండా తెలుగులో ఇక నుంచి ఎక్కువ మూవీస్ చేస్తాను అని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్లో వైరల్ అవుతూ తెగ ట్రెండ్ అవుతోంది.
ఎన్నో తెలుగు సినిమాల ద్వారా ఎన్నో అభిమానులను సొంతం చేసుకుంది. పాపం ఇటీవలే మీనా భర్త అనారోగ్య కారణంగా చనిపోయారు.