టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీగా వున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదిలావుంటే ఇటీవల టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు `సర్కారు వారి పాట` వంటి బ్లాక్ బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలావుంటే మళ్ళీ ఇప్పుడు దాని అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇకపోతే మహేశ్కు 28వ చిత్రం కావడంతో..
`ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. ఈ సినిమాకి తమన్ స్వరాలు అందిస్తున్నారు.ఇదిలావుంటే ఫిబ్రవరిలోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం.. ఇక ఆగస్టు నుండి సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అయితే ఇక ఈ చిత్రంలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నాడని గత కొద్ది రోజుల నుండీ జోరుగా ప్రచారం జరుగుతోంది అన్న విషయం తెలిసిందే.
ఇకపోతే మహేశ్ బాలనటుడిగా ఉన్నప్పుడు.. తండ్రి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన `కొడుకు దిద్దిన కాపురం`లో కెరీర్ లోనే తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశాడు. అయితే హీరోగా ఇప్పటికే డ్యూయల్ రోల్ పోషించింది లేదు.కాగా త్రివిక్రమ్ మూవీలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నాడని వార్తలు రావడంతో.. ఆయన అభిమానులు మహేశ్ డబుల్ యాక్షన్ చూడాలని తెగ ఆశ పడ్డారు.కాగా వారి ఆశ నిరాశే అయ్యేలా కనిపిస్తోంది. అయితే ఎందుకంటే, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఓ పుకారే అట. మహేశ్ డబుల్ రోల్స్లో కనిపిస్తాడు అన్నదాంతో ఎంతమాత్రం నిజం లేదట. ఇకపోతే మహేశ్ బాబు సింగిల్ గానే కనిపిస్తాడనీ .. కాకపోతే మిగతా సినిమాలకి భిన్నంగా కనిపిస్తాడని అంటున్నారు...!!