ఇక హీరోల పుట్టిన రోజునాడు కొత్త సినిమా విడుదలైతే చూస్తాం లేదంటే లేదు అని అనుకునేవారు ఒకప్పుడు. కానీ రీసెంట్గా అయితే అభిమానుల ఆలోచన మారింది.తమ అభిమాన హీరో పుట్టిన రోజు నాడు పాత సినిమాను రీ రిలీజ్ చేయించాలని ఫ్యాన్స్ చూస్తున్నారు. దాని కోసం సూపర్ స్టార్ మహేష్బాబు ఫ్యాన్స్ ఓవైపు ప్లాన్స్ చేస్తుంటే, తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. సోషల్ మీడియా వేదికగా 'జల్సా సినిమా రీ రిలీజ్' అని ట్రెండింగ్ కూడా చేశారు. దీంతో ఆ సినిమా కోసం ఓ నిర్మాత చేసిన ప్రయత్నంతో కొన్ని ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.'జల్సా రీరిలీజ్' అనే ట్రెండింగ్ను చూసి దర్శకుడు ఇంకా నిర్మాత అయితే సాయి రాజేశ్..ఇక ఆ సినిమా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ను సంప్రదించారట. అయితే ఆ సినిమాను థియేటర్లో ప్రదర్శించడానికి అవసరయమ్యే ఒరిజినల్ డీపీఎక్స్ (డిజిటల్ పిక్చర్స్ ఎక్స్ఛేంజ్) ఫైల్ మిస్ అయ్యింది అనే ఓ సమాధానం వచ్చిందట. ప్రస్తుతం అయితే ఆ ఫైల్ వెతికే పనిలో ఉన్నామని,అది దొరకగానే ఇస్తామని గీతా ఆర్ట్స్ టీమ్ చెప్పారట. దీంతో 'జల్సా' సినిమాను మరోసారి వెండితెర మీద చూడాలని అనుకుంటున్న ఫ్యాన్స్ ఆశల మీద నీళ్లు చల్లినట్లు అయ్యింది అని అంటున్నారు.
సెప్టెంబరు 2 వ తేదీన పవన్ కళ్యాణ్ జన్మదినం నాడు 'జల్సా' సినిమాను వెండితెరపై చూసి పండగ చేసుకోవాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ ముచ్చటపడ్డారు.అయితే డీపీఎక్స్ మిస్ అవ్వడంతో ఏమవుతుందా? అనే పరిస్థితి ఇప్పుడు నెలకొంది.పవర్ స్టార్ అభిమానులు మరో సినిమాను ఎంచుకుంటారా? లేక ఆ సినిమా డీపీఎక్స్ కోసమే మళ్ళీ ఎదురుచూస్తారా అనేది తెలియాల్సి ఉంది.అయినా సినిమా డీపీఎక్స్ మిస్ అవ్వడం ఏంటి అనే ప్రశ్న కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది.సినిమా విషయంలో ఇంత అశ్రద్ధ వహిస్తారా అనే ప్రశ్న కూడా ఎక్కువగా కనిపిస్తోంది.ఇక ఆ విషయం పక్కన పెడితే.. ఈ రీ రిలీజ్ కాన్సెప్ట్ను అందరు హీరోల అభిమానులు కూడా టేకోవర్ చేయాలని చూస్తున్నారట. తమ అభిమాన హీరో సినిమాను మరోసారి సిద్ధం చేసి, మళ్ళీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో పడ్డారని సమాచారం తెలుస్తుంది.