మెగాస్టార్ చిరంజీవి ఇంకా టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే.ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఖరారు చేయనున్నారు. ఈ పక్కా మాస్ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి సరసన శృతి హాసన్ నటిస్తుంది.అలాగే ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని అయిన బాబీ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండడంతో ఈ సినిమా పై మెగా అభిమానుల్లో ఎన్నో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నామని ఇటీవల ప్రకటించడంతో మరింత ఆసక్తిగా ఈ మూవీ కోసం మెగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
ఇటీవల రవితేజ ఈ మూవీ షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యారని అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పుడు ఈ మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ కూడా తెలిసింది. అది ఏంటంటే.. ఈ మూవీ టీజర్ అండ్ టైటిల్ ను రిలీజ్ చేయడానికి ముహుర్తం ఫిక్స్ చేశారని సమాచారం తెలిసింది. ఇంతకీ ఎప్పుడంటే.. చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22 వ తేదీన విడుదల చేయనున్నారు.ఇక ఆచార్య సినిమా డబుల్ డిజాస్టర్ అవ్వడంతో మెగాస్టార్ తదుపరి చిత్రాల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ఈ మూవీ కనుక సంక్రాంతికి వస్తే.. మాస్ ఆడియన్స్ కి ఓ ట్రీట్ లా ఉంటుందని భావిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న వాల్తేరు వీరయ్య మూవీ పై ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. మరి.. సంక్రాంతికి వస్తున్న వాల్తేరు వీరయ్య ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తాడో చూడాలి.ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలు వున్నాయి.మెగా అభిమానులు బాబి పై చాలా నమ్మకంగా వున్నారు. మరి బాబీ ఎలాంటి హిట్ ని ఇస్తాడో చూడాలి.