హీరో వెంకటేష్ సినీ ఎంట్రీ ఎలా జరిగిందో తెలుసా..?
అందుకే ఈలోగా పరుచూరి బ్రదర్స్ కథను సిద్ధం చేయడం జరిగిందట.. ఈ సినిమానే కలియుగ పాండవులు. ఈ సినిమాలో హీరోయిన్ ఖుష్బూ ప్రతి నాయకుడు శక్తి కపూర్ టాలీవుడ్ కి పరిచయమయ్యారు. 1986 ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాకి సంగీతాన్ని చక్రవర్తి అందించారు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలను రాబట్టింది దాదాపుగా 14 కేంద్రాలలో 50 రోజులపాటు పూర్తి చేసుకుంది. ఇక విజయవాడలో ఏకంగా 100 రోజులు వేడుకలు కూడా జరుపుకున్నది.
అలా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న వెంకటేష్.. హీరోగా తెలుగు తెరకు పరిచయమై ఇప్పటికి 36 ఏళ్లు పూర్తి చేసుకుంది అయితే ఇండస్ట్రీలో ఎంత బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ హీరోగా నిలబడాలంటే ప్రేక్షకుల ఆదరణ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండాలని చెప్పవచ్చు అలా వెంకటేష్ సినిమా సినిమాకి తనని తాను మార్చుకుంటూ డైలాగ్ లో కూడా పలుమార్పులు చేసుకుంటూ ఎదుగుతూ వచ్చారు స్టార్ హీరోలను తనదైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు వెంకటేష్. వెంకటేష్ కెరియర్లు బొబ్బిలి రాజా చంటి ప్రేమ తదితర సినిమాలు ఆయన కెరీర్ కి పునాదులను చెప్పవచ్చు. అందుచేతనే ఈయనకు విక్టరీ అనే పేరు కూడా సంపాదించారు.