ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరంటే మహేష్ బాబు అనే చెప్పాలి. ఎందుకంటే గత మూడు నాలుగేళ్ల నుంచి ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా తీయకుండా ఓన్లీ రీజనల్ మూవీలతో టాక్ తో సంబంధం లేకుండా మహేష్ హిట్లు కొడుతున్నాడు. ఇక 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తర్వాత దాదాపు రెండున్నరేళ్ళకు మహేష్ 'సర్కారు వారి పాట' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.మంచి ఆకలితో ఉన్న అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ పెట్టింది. ఈ చిత్రంలో మహేష్బాబు క్యారెక్టరైజేషన్ ఇంకా ఎనర్జీ గత చిత్రాలకు భిన్నంగా ఉంది.భారీ అంచనాలతో మే 12 వ తేదీన విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం యమా జోరు చూపించింది.సూపర్ స్టార్ మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సర్కారు వారి పాట నిలిచింది. అయితే 'ఎఫ్3', 'మేజర్', 'విక్రమ్' వంటి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలవడంతో 'సర్కారు వారి పాట' స్పీడుకు కొంచెం బ్రేకులు పడ్డాయి. పైగా అప్పటికి బాగా ఆడుతున్న నిర్మాతల తప్పు వల్ల ముందుగానే ఓటీటిలో విడుదల అయ్యింది.దాంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నా కూడా మరి అంత ఎక్కువ లాభాలు తేలేకపోయింది.
అయినా కూడా ఏకంగా 124 కోట్ల షేర్, 215 కోట్ల గ్రాస్ వసూళ్ల వర్షం కురిపించి సూపర్ స్టార్ స్టామినా ఏంటో రుజువు చేసింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది.‘సర్కారు వారి పాట’ చిత్రం తాజాగా వంద రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని చిలకలూరిపేట కృష్ణమహల్ డీలక్స్ ఇంకా గోపాలపట్నంలోని మౌర్య థియేటర్లలో సర్కారు వారి పాట చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో కూడా అందుబాటులో ఉంది.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మహేష్కు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. అలాగే సముద్రఖని ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. 14రీల్స్ ఎంటర్టైనమెంట్స్ ఇంకా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లతో కలిసి మహేష్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.