ప్రభాస్ తో కరీనా.. స్పిరిట్ న్యూస్ పై స్పందించిన బేబీ..!
ఇక నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె అయితే హాలీవుడ్ సినిమాగా తెరకెక్కుతుంది. ఆ సినిమా కోసం 500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు అంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ కె తర్వాత ప్రభాస్ అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగాతో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కరీనా కపూర్ ని ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి.
వీటిపై కరీనా బేబీ కూడా స్పందించింది. స్పిరిట్ కి సంబందించిన ఎవరు తనని మీట్ అవలేదని చెప్పింది. అయితే ప్రభాస్ తో సినిమా ఆఫర్ వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తానని అంటుంది అమ్మడు. బాహుబలి తర్వాత ప్రభాస్ తో సినిమా అంటే అందరు సై అనేస్తున్నారు. అంతేకాదు సౌత్ సినిమాలు నేషనల్ లెవల్ లో సత్తా చాటుతున్న ఈ టైం లో సౌత్ సినిమా హీరోయిన్ ఛాన్స్ అంటే ఓకే చెప్పేస్తారు.
అయితే స్పిరిట్ లో ఆల్రెడీ రష్మిక మందన్న హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని అంటున్నారు. స్పిరిట్ సినిమా కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ తో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా తప్పకుండా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అంటున్నారు. ఈ మూవీ డీటైల్స్ అయితే మాత్రం త్వరలో వెళ్లడిస్తారు.