కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం ఈయన స్పీడు మీదున్నాడు. ఈయన వరుసగా కథలను ఓకే చేస్తూ సెట్స్పైకి తీసుకెళ్తున్నాడు.అంతేకాదు ఇటీవలే భారీ అంచనాలతో విడుదలైన 'బీస్ట్' తీవ్రంగా నిరాశపరిచింది.అయితే ఇక ప్రేక్షకులే కాదు అభిమానులు కూడా ఈ చిత్ర ఫలితాన్ని జీర్ణించుకోలేకపోయారు.ఇదిలావుంటే ప్రస్తుతం ఈయన వంశీపైడిపల్లి దర్శకత్వంలో నేరుగా తెలుగులో వారసుడు సినిమా చేస్తున్నాడు.కాగా ఇటీవలే విడుదలైన విజయ్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ చిత్రం తర్వాత విజయ్, లోకేష్ కనగరాజ్తో సినిమా చేయనున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ చివర్లో సెట్స్పైకి వెళ్ళనుంది.అయితే లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని గ్రాండియర్గా, భారీ స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. నటీనటుల విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా బిగ్ స్టార్ కాస్ట్ను ఎంపిక చేసుకుంటున్నాడు.ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ను కీలకపాత్ర కోసం ఎంపిక చేశాడు.
ఇక ఇదిలా ఉంటే తాజాగ ఈయన రెమ్యునరేషన్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. అయితే ఈ చిత్రం కోసం సంజయ్ దత్ దాదాపు రూ.10 కోట్ల వరకు డిమాండ్ చేశాడట.కాగా దానికి మేకర్స్ కూడా ఒప్పుకున్నారట. ఇకపోతే ఈ సినిమా కోసం సంజయ్ దత్ ఎక్కవ రోజులే కాల్షీట్లు ఇచ్చాడని టాక్.ఇదిలావుంటే విజయ్- లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగానే అంచనాలున్నాయి. ఇకపోతే గతంలో వీళ్ళ కాంబోలో వచ్చిన మాస్టర్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇదిలావుంటే ఈ చిత్రం కూడా లోకేష్ తన మల్టీవర్స్లో భాగంగానే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇక ఈ చిత్రం కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లను లోకేష్ రంగంలోకి దింపనున్నట్లు టాక్..!!