తాజాగా శనివారం బెంగుళూరులో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా 2022) ఈవెంట్ ఘనంగా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ వేడుకలకు దక్షిణాది స్టార్స్ హాజరయ్యారు.కాగా అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, యశ్, పూజా హెగ్డే, సుకుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గోన్నారు. ఇకపోతే ఈ వేడుకలకు బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ కూడా విచ్చేశారు. అంతేకాకుండా ఇక ఈ ఈవెంట్తో తన స్టైల్లో సందడి చేశారు రణ్వీర్.అయితే సైమా అవార్డ్స్ 2022లో రణ్వీర్ సింగ్ మోస్ట్ పాపులర్ హిందీ యాక్టర్ అవార్డును అందుకున్నారు.
కాగా ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ సెల్ఫీ తీసుకునేందుకు అభిమానులు భారీ సంఖ్యలో విచ్చేశారు. ఇక దీంతో తన ఫ్యాన్స్తో కలిసి సెల్ఫీలకు ఫోజులిచ్చారు బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ .అయితే ఇక ఎంతో సరదాగా అభిమానులతో కలిసి ఫోటోస్ దిగుతున్నబాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ను…అతని బాడీగార్డ్ ఒకరు పోరపాటును చెంపదెబ్బ కొట్టారు. కాగా దీంతో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ తోపాటు అక్కడున్నవారంత షాకయ్యారు.అయితే తన చెంపను పట్టుకొని ఆశ్చర్యపోయాడు ఈ హీరో.కాగా అనంతరం పోరపాటున జరిగిందని గ్రహించి తిరిగి నవ్వుతూ అభిమానులతో కలిసిపోయారు. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇకపోతే సైమా అవార్డ్స్ వేదికపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ, కన్నడ హీరో శివరాజ్ కుమార్ తో కలిసి స్టెప్పులేశాడు రణ్వీర్.ఇక రణవీర్ సినిమాల విషయానికొస్తే.. సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన అపరిచితుడు సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ రీమేక్ ని కూడా శంకర్ దర్శకత్వం వహించడం విశేషం. ప్రస్తుతం రామ్ చరణ్ తో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న శంకర్.. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన అనంతరం రణవీర్ తో అపరిచితుడు రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాడున్నాడు..!!