టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఫలితం ఎలా ఉన్నా చిరంజీవి మాత్రం వరుసగా సినిమాలను చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే ఇటీవలే ఈయన నటించిన 'ఆచార్య' విడుదలై ఫ్లాప్గా నిలిచింది.ఎన్నో ఆశలతో మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో పాటు అటు ఆయన తనయుడు కూడా వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు.
ఇక ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు మెగా ఆభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది.అయితే ఈ క్రమంలో చిరు తన తదుపరి చిత్రాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. ఇదిలావుండగా ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను సెట్స్పై ఉంచాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అందులో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వాల్తేరు వీరయ్య' ఒకటి. ఇకపోతే యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన మాస్రాజా రవితేజ కీలకపాత్రలో నటించనున్న విషయం తెలసిందే. కాగా ఇప్పుడు మరో ఇద్దరు స్టార్ హీరోలు గెస్ట్రోల్లో మెరవనున్నారట. ఇక విక్టరీ వెంకటేష్, నాగార్జున అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.ఇకపోతే ఇందులో నిజమెంతుందో తెలియదు కాదు.అయితే ఈ ముగ్గురు హీరోలు ఒకే సారి స్క్రీన్ పై కనిపిస్తే మాత్రం ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటారు. ఇక ఈ చిత్రంలో చిరు అండర్ కవర్ కాప్గా కనిపించనున్నాడు. ఇక చిరుకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. కాగా మైత్రీ మూవీ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు..!!