మన చిత్రాలకు షాక్ ఇస్తున్న హాలీవుడ్ చిత్రం..!!

Divya
మన సినిమాలకు ప్రతి సీజన్లో కూడా హాలీవుడ్ చిత్రాలు విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్ద షాక్ ఇస్తున్నాయని చెప్పవచ్చు.దీపావళి సీజన్లో విడుదలైన క్రేజీ హాలీవుడ్ చిత్రం దాటికి మన సినిమాల తీవ్రస్థాయిలో బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా ఎదురుదెబ్బ తగులుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ రోజున బాక్సాఫీస్ దగ్గర నాలుగు చిత్రాలు విడుదలై పోటీ పడగా ఇందులో రెండు స్ట్రైట్ సినిమాలు కాగ రెండు డబ్బింగ్ చిత్రాలు. అందులో ఒకటి మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా, మరొకటి కార్తి నటించిన సర్దార్, మరొకటి విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా, హీరో శివ కార్తికేయన్ నటించిన ప్రిన్స్ సినిమాలు ఈరోజు విడుదలయ్యాయి.
ఇది ఇదే రోజున హాలీవుడ్ మూవీ బ్లాక్ ఆడమ్ కూడా భారీ స్థాయిలో విడుదల కావడం జరిగింది. ఈ చిత్రంలో డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ స్టార్ డ్వైన్ జాన్సన్ హీరోగా నటించారు ఈ చిత్రం అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన సినిమా తెలుగు డబ్బింగ్ సినిమాకు మించి హాలీవుడ్ మూవీ అత్యధిక స్థానాల్లో అడ్వాన్స్ బుకింగ్ ను సంపాదించింది. భారీ స్థాయిలో రూపొందించిన ఈ సినిమా కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ తో అడ్వెంచర్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం భారీ స్థాయిలోని బుకింగ్ చేసుకోవడంతో పలువురు సైతం ఆచార్యపోతున్నారు.
ఫస్ట్ డే డీసెంట్ ఓపెనింగ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రానున్న రోజుల్లో మరింత వసూలు పెరిగే అవకాశం ఉందని ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత బ్లాక్ ఆడమ్ లాంటి సినిమా రావడంతో వీకెండ్లు ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉన్నప్పుడు సమాచారం. ఇదంతా ఇలా ఉండగా ఈరోజు విడుదలైన తెలుగు తమిళ డబ్బింగ్ సినిమాలు ఏది పై సాధిస్తుందని విషయం ఇప్పుడు అందరిలోనూ చాలా ఆసక్తి కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: