ముంబై ప్రత్యేక కోర్టు వెలువరించిన సంచలన తీర్పు.. ఇద్దరు టాలీవుడ్ సెల్రబిటీల మధ్య మాటల యుద్ధం రాజేసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఈ ఇద్దరు టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు నెట్టింట వైరలవుతున్నాయి. అమ్మాయిని ఐటమ్ అన్నందకు ఓ యువకుడికి ముంబై ప్రత్యేక కోర్టు.. ఏడాదిన్నర కాలం జైలు శిక్ష వేసిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు ఇద్దరు టాలీవుడ్ నటుల మధ్య మాటల యుద్ధం రాజేసింది అంటున్నారు.. వారి సోషల్ మీడియా పోస్టులు చూసిన అభిమానులు.ఆ వివరాలు.. టాలీవుడ్ యువ నటి కల్పికా గణేష్ గుర్తుందా.. ప్రయాణం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంతకు అక్కగా చేసిన పాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్లో పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్గా ఉంటుంది కల్పిక. ఈ క్రమంలో బుధవారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కొన్ని ఆసక్తికరమైన పోస్టులు చేసింది కల్పిక. మరీ ముఖ్యంగా వీటిల్లో ఈ నగరానికి ఏమైంది ఫేమ్ అభినవ్ గోమటాన్ని టార్గెట్ చేసింది. అతడు తనకు సారీ చెప్పాల్సిందిగా డిమాండ్ చేసింది కల్పిక.కల్పిక సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉంటుంది. ఇక ఎవరైనా మహిళలను కించ పరుస్తూ ఏవైనా పోస్టులు పెడితే.. వెంటనే రియాక్టయ్యి.. వారికి గట్టిగా బుద్ధి చెబుతుంది కల్పిక. ఈ క్రమంలో తాజాగా బుధవారం కల్పిక.. తన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కొన్ని పోస్ట్లు పెడుతూ వస్తోంది. తనకు ఇన్స్టాగ్రామ్లో వ్యక్తిగతంగా మెసేజ్లు చేస్తున్న వారి స్క్రీన్షాట్లను తీసి.. వారికి రిప్లై ఇస్తోంది కల్పిక. ఈ క్రమంలో అభినవ్ గొమటం గురించి రాసుకొచ్చింది కల్పిక.అతడు ఇటీవల ఓ షోలో కల్పికకు అవార్డు రావడం గురించి ఏదో కామెంట్ చేశాడట. దీని గురించి చెబుతూ.. అభినవ్ తనకు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తుంది. అంతేకాక.. అతడి స్నేహితులను ట్యాగ్ చేసి.. తనకు సారీ చెప్పించమని చాలెంజ్ చేస్తోంది. కానీ అభినవ్ మాత్రం తనకు ఆ అవసరం లేదని అంటున్నాడు. ఇక వీరి మధ్య జోక్యం చేసుకున్న వారి ఇన్స్టాగ్రామ్ చాట్ స్క్రీన్షాట్స్ని షేర్ చేస్తోంది కల్పిక. మరి వీరిద్దరి మధ్య ప్రారంభమైన వివాదానికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాలి.