బాలీవుడ్: "బ్రహ్మాస్త్ర 2" లో సత్యదేవ్... ?
బ్రహ్మాస్త్రలో రణ్ బీర్ కపూర్ మరియు ఆలియా భట్ లు హీరో హీరోనే లుగా నటించగా, అమితాబ్ బచ్చన్ , షారుఖ్ ఖాన్, నాగార్జున మరియు మౌనీ రాయ్ లు కీలకపాత్రలు పోషించారు. చివర్లో చిరంజీవి వాయిస్ ఓవర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కించారు. ఈ సినిమా వి ఎఫ్ ఎక్స్ ఆధారంగా తెరకెక్కించిందే అయినా విజువల్స్ పరంగా ఆకట్టుకోలేదు అని కామెంట్స్ వచ్చాయి. కాగా ఈ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కించే పనిలో ఉన్నారట దర్శకుడు అయాన్ ముఖర్జీ. అయితే బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సెకండ్ పార్ట్ లో టాలీవుడ్ విలక్షణ నటుడు సత్యదేవ్ ఒక కీలక పాత్రలో నటించనున్నారట.
మొన్ననే గాడ్ ఫాదర్ తో విలన్ గా చేసి ఆకట్టుకున్నాడు సత్యదేవ్ మరియు ఈ వారంలో బాలీవుడ్ లోనూ రామ్ సేతు మూవీతో అక్షయ్ కుమార్ తో కలిసి నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా ఫెయిల్ అయినా సత్యదేవ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ బజ్ ను కరణ్ జోహార్ బ్రహ్మాస్త్ర 2 లో నటింపచేయాలని ప్లాన్ లో ఉన్నారట. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే అటు సత్యదేవ్ లేదా కరణ్ జోహార్ అధికారిక ప్రకటన చేసే వరకు ఆగాల్సిందే.