బాలీవుడ్ హీరో సరసన అమలాపాల్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి అమలా పాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమలా పాల్ తెలుగు లో ఇద్దరమ్మాయిలతో ,  నాయక్ మరియు మరి కొన్ని మూవీ లలో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం అమలా పాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలను దక్కించు కోవడంలో చాలా వరకు వెనకబడి పోయింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం కుడి ఎడమైతే అనే వెబ్ సిరీస్ లో అమలా పాల్ నటించింది. ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా అమలా పాల్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అమలా పాల్ కు ఒక క్రేజీ బాలీవుడ్ మూవీ లో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ...  ప్రస్తుతం అజయ్ దేవగన్ "బోలా" అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో అమలా పాల్ , అజయ్ దేవ్ గన్ సరసన అమలా పాల్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ సెట్స్ లో అమలా పాల్ కూడా జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో టబు కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే బోలా సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే అమలా పాల్ కు బాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజ్ అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంది. మరి బోలా సినిమాతో అమలా పాల్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏ రేంజ్ క్రేజ్ ను దక్కించుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: