సాధారణంగా తమిళ దర్శకుడు అట్లీ ..కాపీ వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు. ఇక తన కెరీర్ లో భారీ హిట్టు సినిమాలు తీసినా అన్నీ వేరే వారి వర్క్ నుంచి కాపీనే అంటూ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.ఇక ఆయన సినిమాలు వందల కోట్లు వసూలు చేశాయి.ఇకపోతే అది అతని తెలివి కాదని, కేవలం కాపి కొట్టే నైపుణ్యం అంటారు విమర్శకులు. ఇక ఏమైతేనేం స్టార్ డైరక్టర్ గా వెలుగుతున్న అట్లీ పై మరోసారి ఈ కాపీ మరక పడింది.ఇదిలావుంటే ఈ దర్శకుడు బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నారు.కాగా షారుఖ్ ఖాన్ హీరోగా 'జవాన్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ సినిమాపై కాపీ ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇకపోతే మాణిక్యం నారాయణన్ అనే నిర్మాత ఈ సినిమా కథ తనదని.. దర్శకుడు అట్లీ కాపీ చేశారని ఆరోపిస్తున్నారు.అయితే బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. అట్లీ జవాన్ పై ప్రముఖ తమిళ నిర్మాత మాణికం నారాయణన్ తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (TFPC)లో ఫిర్యాదు చేసారు. కాగా విజయకాంత్ నటించిన 2006 తమిళ చిత్రం `పేరరసు`ని కాపీ చేసాడని దర్శకుడు అట్లీపై ఫిర్యాదు చేసాడు.ఇక రెండు కథలు ఒకేలా ఉన్నాయని అతడు ఆరోపిస్తున్నా కానీ ఫిర్యాదునకు కారణం అస్పష్టంగా ఉంది.అయితే అట్లీ తన చిత్రాలతో ప్లాగరిజం సమస్యలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదని కూడా సదరు నిర్మాత విమర్శించారు.
ఇకపోతే 'పేరరసు' హక్కులు ఇప్పటికీ తన దగ్గరే ఉన్నాయని.. అలాంటి కథను ఎలా కాపీ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు మాణిక్యం. ఇకపోతే 'పేరరసు' చిత్రంలో విజయకాంత్ కవల సోదరులుగా కనిపిస్తారు.ఇక పేరరసు -ఇళవరసుగా ద్విపాత్రాభినయం చేసారు. ఈ చిత్రంలో రెండో క్యారక్టర్ బాధ్యతాయుతమైన సీబీఐ అధికారి అయితే.. తన తండ్రి మరణానికి కారకుడైన మాజీ మంత్రిపై ప్రతీకారం గా అతడిని చంపాలని వేట సాగించేవాడిగా మొదటి పాత్ర నడుస్తుంది. ఇక జవాన్ కూడా అలాంటిదే అంటున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా రవిచంద్రన్ వర్క్ చేస్తున్నారు.కాగా ఈ సినిమాను సౌత్ లో కూడా భారీగా రిలీజ్ చేయాలనేది దర్శకుడి ప్లాన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.ఇక ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తోంది.ఇకపోతే హిందీ- తమిళం- తెలుగు- మలయాళం - కన్నడ భాషల్లో 2 జూన్ 2023న `జవాన్` విడుదల కానుంది.ఇక ఇలాంటి సమయంలో సినిమాపై కాపీ ఆరోపణలు వస్తున్నాయి..!!