కృష్ణ గారి మరణ వార్తకు ఎమోషనలైన చిరంజీవి?

Purushottham Vinay
టాలీవుడ్ లెజెండరి సూపర్ స్టార్ కృష్ణ గారి మృతితో సినీ ఇండస్ట్రీ అంతా కూడా విషాదంలో మునిగిపోయింది. కార్డియాక్ అరెస్ట్ తో హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పటల్ లో చేరిన కృష్ణ గారు నేడు తెల్లవారు జామున 4 గంటలకు కన్నుమూశారు.కృష్ణ గారి మరణవార్త విని ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది. కృష్ణ మృతికి సినీ ప్రముఖులు ఇంకా రాజకీయనాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్ర గవర్నర్, సీఎం జగన్ మోహన్ రెడ్డి, రోజా వంటి ప్రముఖులు నివాళులు అర్పించారు. ఇక కొంతమంది సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా లో స్పందిస్తూ..ఈ విధంగా పేర్కొన్నారు.'మాటలకు అందని విషాదం ఇది. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం. 


సాహసానికి వూపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం..వీటి కలబోత కృష్ణ గారు.అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమ లోనే కాదు, భారత సినీపరిశ్రమ లోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ,అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలి జేసుకొంటున్నాను.. అంటూ మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అవుతూ ఒక నోట్ తో కూడిన పోస్ట్ ని ట్వీట్ చేశారు. నిజానికి మహేష్ బాబుకి ఈ ఏడాది చాలా విశాదం అనే చెప్పాలి. వరుసగా తన అన్నగారు, తల్లిగారు, తండ్రి గారు మరణించడం ఆయనకు తీరని లోటు అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు చాలా స్ట్రాంగ్ గా వుండాలని ఆయన అభిమానులు ఇంకా సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: