నటుడు ప్రభువుకి అస్వస్థత.. హాస్పిటల్ కి తరలింపు..!
ఇదిలా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి పేరు సంపాదించుకున్న ప్రభు గురించి ఏ చిన్న వార్త వచ్చినా సరే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయన అస్వస్థకు గురైనట్లు వార్తలు రావడంతో పాటు సెలబ్రిటీలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. గత కొద్ది రోజులుగా ప్రభు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అస్వస్థకు గురి కావడంతో మంగళవారం చెన్నైలోని కేలంబాక్కం లో మేడ్వే ఆసుపత్రికి తరలించగా.. యురేత్రో స్కోపీ లేజర్ సర్జరీ ద్వారా ఆయన మూత్రపిండాలలో ఉన్న రాళ్లను తొలగించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతోంది అని.. మరో రెండు రోజుల్లో డిస్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.. ఈ విషయం తెలిసి అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. అలాగే ఆయన ఆరోగ్యం గురించి ఆయన కుటుంబ సభ్యులను సినీ ప్రముఖులు అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తానికైతే ప్రభు ఆరోగ్యం ఇప్పుడు కుదుటపడుతోందని తెలిసి అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. ఇకపోతే ఆయన చివరిసారిగా విజయ్ దళపతి హీరోగా నటించిన వారిసు చిత్రంలో నటించారు.