పాన్ ఇండియా స్టార్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి.ఎందుకంటే ఆయన గతంలో ఎన్నడూ లేని అంత స్పీడ్ గా వరుసగా రెండు పెద్ద పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో గేమ్ చేంజర్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్తో ఇండియన్ 2 సినిమాలు ఒకేసారి తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు శంకర్. అయితే శంకర్ తన గేమ్ చేంజర్ కథను ముందుగా నిర్మాత దిల్ రాజుకు వినిపించిన తరువాత.. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో అయితే బాగుంటుందని అన్నాడట. కానీ దిల్ రాజు మాత్రం పవన్ కళ్యాణ్ కంటే రామ్ చరణ్కి ఈ కథ ఇంకా బాగుంటుందని అన్నాడట.ఇక శంకర్ మేనేజర్ ద్వారా ఈ కథ తన వద్దకు వచ్చిందట. ఓ మంచి కథ ఉందని వినమని దిల్ రాజుకు పంపించారట. కథ విన్నాక అది దిల్ రాజుకు చాలా బాగా నచ్చిందట. ఈ కథకి ఏ హీరో అనుకుంటున్నారని దిల్ రాజు అడిగితే.. పవన్ కళ్యాణ్ లాంటి హీరో అయితే బాగుంటుందని ఆయన అన్నారట. అయితే ఈ కథ రామ్ చరణ్కు ఇంకా బాగా సూట్ అవుతుందని దిల్ రాజు చెప్పాడట.
ఇక ఆ సమయంలో ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్తో రామ్ చరణ్ ఫుల్ బిజీగా ఉండగా.. ఓ సారి కలిసి శంకర్ చెప్పిన కథ గురించి చరణ్ కి చెప్పాడట.కరోనా టైంలోనే ఫోన్ ద్వారా కథను రామ్ చరణ్కు డైరెక్టర్ శంకర్ వినిపించాడట. ఆ కథ బాగా నచ్చడంతో రామ్ చరణ్ కూడా ఓకే చెప్పేశాడట. అలా ప్రాజెక్ట్ను లాక్ చేసినట్టుగా నిర్మాత దిల్ రాజు చెప్పాడు.ఇక రామ్ చరణ్ ప్రాజెక్ట్లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే ఈ రేంజ్లో పాటలు, సెట్టింగ్స్ కూడా వచ్చినట్టు సమాచారం తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత గ్లోబల్ స్టార్గా మారిన రామ్ చరణ్ కి ఈ ప్రాజెక్ట్ నిజంగానే గేమ్ చేంజర్ అయ్యేలా ఉంది. శంకర్, దిల్ రాజు వంటి వారితో రామ్ చరణ్ సినిమా చెయ్యడంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.ఇక గేమ్ చేంజర్ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతికి బరిలోకి దించబోతోన్నట్టుగా నిర్మాత దిల్ రాజు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే సంవత్సరం సంక్రాంతి పోటీ ఇప్పటి నుంచే బాగా రసవత్తరం అయింది.సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి వారు సంక్రాంతి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు.