ఆదిపురుష్ ట్రైలర్ టాక్: కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్?
పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆది పురుష్ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ హాట్ హీరోయిన్ కృతిసనన్ సీతగా ఓం రౌత్ దర్శకత్వంలో ఇతిహాసగాథ 'ఆది పురుష్' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ మూవీలో రావణాసురుడి పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు 'ఆది పురుష్' ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ఆదిపురుష్ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇంకా మలయాళ భాషల్లో విడుదల కానుంది. అన్ని భాషల్లో విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రస్తుతం సినీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.
ట్రైలర్లో సీతను రావణుడు అపహరించడంతో మొదలుపెట్టి రాముడి (రాఘవుడు) ఆగమనం, ఆయోధ్య పరిచయం ఇలా కొనసాగించి చివరికి రామ, రావణ యుద్ధం షాట్లతో ట్రైలర్ను చాలా బాగా కంప్లీట్ చేశారు.ఇక ఇదిలా ఉంటే..సూపర్ స్టార్ మహేష్ ఏఎమ్బీ మాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ఆదిపురుష్ ట్రైలర్ను స్ట్రీమింగ్ చేశారు.అయితే ట్రైలర్ను చూసిన వారంతా.. చాలా అద్భుతంగా ఉందంటూ కితాబిస్తున్నారు. టీజర్ కన్నా వంద రెట్లు ఈ ట్రైలర్ మెరుగ్గా ఉందని, విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.ఇక ఆదిపురుష్ టీజర్తో చాలా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మేకర్స్ ట్రైలర్తో ఆకట్టుకుంటారా.. లేదా..? అనే కోటి ప్రశ్నల మధ్య.. ఈరోజు ట్రైలర్ విడుదల కావడం అలాగే సినీ ప్రేక్షకుల నుంచి రెట్టింపు స్పందన లభిస్తుండటంతో గతంలో ఉన్న అన్ని నెగటివిటీలను కూడా ఈ ట్రైలర్ దూరం చేసింది.