మనీ: రూ.330 పొదుపు చేస్తే చాలు రూ.14 లక్షలు మీ సొంతం..!

Divya
ఇటీవల కాలంలో చాలామంది భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పటినుంచి డబ్బులు పొదుపు చేస్తూ వస్తున్నారు. అందుకే చాలామంది పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో ఇన్వెష్ట్ చేస్తున్నారు. లేదంటే బ్యాంకు పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. అయితే వీటిల్లో ఇన్వెష్ట్ చేస్తే తక్కువ రాబడి వస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుల్లో అటు ఇటుగా ఏడు శాతం వరకు వడ్డీ పొందవచ్చు. ఈ వడ్డీ రేటు ప్రాతిపదికను చూసుకుంటే మన డబ్బులు రెట్టింపు అవ్వాలంటే 10 సంవత్సరాల పైనే పడుతుంది. ఇలా కాకుండా ఐదేళ్లలోని మీ డబ్బును రెట్టింపు చేసే పథకాలు కూడా కొన్ని ఉన్నాయి. వీటిలో ఎటువంటి రిస్కు ఉండదు. పైగా మీ డబ్బు రెట్టింపు అవడం ఖాయం. మరికొన్ని పథకాలలో రిస్క్ ఉంటుంది. కానీ డబ్బు ఎక్కువగా వస్తుంది. మరి అలాంటి పథకాల గురించి ఇప్పుడు చూద్దాం.

మ్యూచువల్ ఫండ్స్ కి చెందిన ఈక్విటీ స్కీంలో అధిక రాబడి పొందవచ్చు. ఈ స్కీమ్స్ మార్కెట్ రిస్క్ కి లోబడి ఉంటాయి.  అందువల్ల డబ్బులు పెట్టేవారు రిస్కు ఉంటుందని కూడా గుర్తించుకోవాలి . అయితే దీర్ఘకాలంలో మంచిరాబడి పొందవచ్చు అని కూడా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐదేళ్ల కాలంలో అదిరే రాబడి అందించిన పలు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి ఇప్పుడు చూద్దాం..

ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్.. ఐదేళ్ల రాబడి 26 శాతానికి పైగా పెరిగింది.. అంటే ఐదేళ్ల కిందట ఈ ఫండ్లో లక్ష రూపాయలు పెట్టి ఉంటే దాని విలువ రూ.3.21 లక్షలు వచ్చేవి . అదే నెలకు రూ.పదివేలు ఇన్వెస్ట్ చేస్తే రూ. 14 లక్షలకు పైగా లభించేవి. రూ. 330 చొప్పున ప్రతిరోజు ఇన్వెస్ట్ చేసి ఉండి ఉంటే రూ.14లక్షలు మీ చేతికి వచ్చేవి.


ఎస్బిఐ టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఫండ్ కూడా ఒకటి. ఐదు సంవత్సరాల రాబడి కి 24 శాతంగా ఉంది అంటే మీరు ఐదేళ్ల కిందట ఈ ఫండ్ లో లక్ష రూపాయలు పెట్టి ఉంటే దాని విలువ మూడు లక్షలు వచ్చేవి.  అదే నెలకు పదివేల చొప్పున పెడుతూ వచ్చి ఉంటే రూ. 13.5 లక్షలు పొందేవారు. ఈ పథకాలలో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభాలు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: