టమాటాకు పోటీగా మరో కూరగాయ.. కిలో రూ.150 పైనే?

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒకే విషయం గురించి తెగ చర్చించుకుంటున్నారు. అదే పెరిగిపోయిన టమాటా ధరల గురించి. సాధారణంగా అయితే రోజువారి వంటలో సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా టమాట వాడటం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం పెరిగిపోయిన ధరల కారణంగా టమాటా కేవలం సంపన్నుల కోసమే అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే మార్కెట్కు వెళ్లి టమాటా కొనుగోలు చేయాలన్న కొనలేని పరిస్థితి సామాన్యులకు వచ్చింది. కొండెక్కిన టమాటా ధరలను చూసి ఇక సామాన్యులు అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు అని చెప్పాలి.


 అయితే ఇప్పటికే టమాటా బాదుడు తట్టుకోలేకపోతున్న సామాన్య జనాలు ఇక రానున్న రోజుల్లో ఉల్లిపాయ ధరలు కూడా భారీగా పెరిగిపోయే అవకాశం ఉంది అంటూ వార్తలు తెరమీదకి వస్తున్న నేపథ్యంలో మరింత ఆందోళనలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇప్పటికే టమాట ధరలు 150 రూపాయలకు పైగా పలుకుతూ ఉండగా..  ఇక ఇప్పుడు టమాటాకు పోటీగా మరో కూరగాయ కూడా తెరమీదికి వచ్చింది అన్నది తెలుస్తుంది. ఆ కూరగాయ ఏదో కాదు క్యాప్సికమ్. ఏకంగా టమాటాకు మించిన ధరలు పలుకుతూ సామాన్యులందరికీ కూడా మరింత భారంగా మారిపోతోంది అని చెప్పాలి. దీంతో సామాన్యుడు కనీసం క్యాప్సికమ్ వైపు కన్నెత్తి కూడా చూడలేని విధంగా విధంగా రేట్లు భారీగా పెరిగిపోయాయి.


 ప్రస్తుతం బెంగళూరు మిరపకాయగా పిలుచుకునే గ్రీన్ క్యాప్సికమ్ కిలో ధర 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పరుకుతూ ఉంది అని చెప్పాలి. ఇప్పటికే టమాటా ధర భారీగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు బేంబేలెత్తుతూ ఉండగా ఇప్పుడు క్యాప్సికమ్ ధర కూడా కొండెక్కి కూర్చోవడంతో.. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు జనాలు. అదే సమయంలో ఇతర కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతూన్న తరుణంలో ఇక అటు సామాన్యుడికి కాయగూరలు కూడా ఎంతో భారంగా మారిపోయాయి అని చెప్పాలి. దీంతో ధరలు తగ్గుదలకు ఏదైనా చర్యలు చేపట్టాలి అని అటు సామాన్య ప్రజలు  ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: