వామ్మో.. ఈ రాఖీ ధర.. ఐఫోన్ కంటే ఎక్కువే?

praveen
రాఖీ పండుగ వచ్చిందంటే చాలు ఏ దుకాణంలో చూసినా రంగు రంగుల రాఖీలు దర్శనమిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతోమంది అక్క చెల్లెలు తమ అన్నదమ్ములకు కట్టేందుకు తమకు నచ్చిన రాఖీని కొనుగోలు చేయడానికి దుకాణాల ముందు బారులు తీరుతూ ఉంటారు. అయితే ఇక ఎన్నో రకాల ఆ రాఖీలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే రాఖీ ధర ఎంత ఉంటుంది అని అడిగితే మహా అయితే ఒక వెయ్యి లేదా రెండు వేల వరకు ఉంటుందని అందరూ అంటారు. కానీ ఇక్కడ రాఖీ ధర గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు.



 ఐఫోన్ కంటే ఎక్కువ కాస్లి రాఖి కి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ప్రతి ఏడాది వారణాసిలో గోల్డ్ రాఖీలు అబ్బురపరుస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ గోల్డ్ రాఖీల ధర ఐఫోన్ కన్నా ఎక్కువ ఉండడం విశేషం. ప్రస్తుతం వారణాసిలో ఉన్న దుకాణాలలో అమ్ముతున్న రాఖీల విలువ దాదాపు 1.15  లక్షల వరకు ఉంటుందట. కాస్త తక్కువ బరువు ఉన్న గోల్డ్ రాఖీలు అయితే 80 వేల వరకు ధర ఉంటుందట. అయితే ఒకే డిజైన్ లో కాకుండా వేర్వేరు డిజైన్లలో కూడా ఈ గోల్డ్ రాఖీలు అందుబాటులో ఉన్నాయట.


 అయితే ఈ గోల్డ్ రాఖీకి మరింత స్పెషాలిటీ కూడా ఉంది. బంగారం మాత్రమే కాదు వజ్రాలు కలిపి ప్రత్యేకంగా వ్యాపారులు ఈ గోల్డ్ రాఖీని తయారు చేస్తారట. అయితే కొంతమంది ముందుగానే ఆర్డర్ ఇచ్చి మరి ఈ రాఖీలను తయారు చేయించుకుంటూ ఉంటారట. 18, 20, 22 క్యారెట్ల బంగారంతో తయారైన రాఖీలు ఇక్కడ అందుబాటులో ఉంటాయట. ఇక వీటిల్లో కొన్ని ప్రత్యేకమైన రాఖీలు 15 వేల నుంచి ప్రారంభం అవుతాయని తెలుస్తుంది. గులాబీ రంగు మీనారికతో రూపొందిన రాఖి 22,000 రూ.. పింక్ మీనాకరి రంగుతో రూపొందిన రాఖి ధర పదివేల వరకు ఉంటాయని అక్కడి వ్యాపారాలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: