దర్శకులకి అందుబాటులో లేని అఖిల్
ఆ విధంగా అఖిల్ ని డెబ్యూ హీరోగా లాంచ్ చేసి, ఇప్పుడు పడరాని మాటలు పడుతున్నాడు. వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ, ఆల్టైమ్ డిజాస్టర్స్ లిస్ట్ లో ఒకటిగా నిలచింది. దాదాపు 20 కోట్ల రూపాయల నష్టంతో నిర్మాతలకి, బయ్యర్లకి ఇప్పటికీ వణుకు తెప్పిస్తుందట. ఇక తన మొదటి సినిమా బాక్సాపీస్ వద్ద కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందని ఊహించిన అఖిల్ కి, ఈ రిజల్ట్ చాలా డిజప్పాయింట్ ని ఇచ్చింది.
దీంతో అఖిల్ ప్రస్తుతం ఎవ్వరికీ అందుబాటులో లేడంట. అఖిల్ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ దమ్మురేపటంతో...ఈ మూవీ సక్సెస్ సాధించిందని గోవా ట్రిప్ కి వెళ్ళాడు. కానీ గోవా నుండి రిటర్న్ అవుతున్న సమయంలో అఖిల్ మూవీ కలెక్షన్స్ డ్రాప్ కావటంతో మళ్ళీ నిరాశతో హైదరాబాద్ కి వచ్చాడు. దీంతో ప్రస్తుతం అఖిల్ కొత్త కథలేమీ వినకుండా సైలెంట్గా వుంటున్నాడంట. కొత్త దర్శకుడు, స్టార్ డైరెక్టర్స్ కథ చెప్తామంటూ వెళ్లినా, ఒక నెల రోజుల తర్వాత రమ్మంటున్నాడట.
కొంత రిలాక్స్ అయిన తరువాత, కొత్త కథలను వినే మూడ్ లో అఖిల్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకూ సోలో నిర్ణయాలతో లైఫ్ ని లీడ్ చేసిన అఖిల్, ఇక నుండి తన సన్నిహితులు, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నిర్ణయాలను తీసుకునేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.